అవేవీ థియేటర్ అనుభూతి ఇవ్వలేవు.. డైనమిక్ డైరెక్టర్ మారుతి..

  • Published By: sekhar ,Published On : October 7, 2020 / 06:32 PM IST
అవేవీ థియేటర్ అనుభూతి ఇవ్వలేవు.. డైనమిక్ డైరెక్టర్ మారుతి..

Updated On : October 7, 2020 / 7:20 PM IST

Director Maruthi Special Interview:
కోవిడ్ 19 లాక్‌డౌన్ సమయాన్ని ఎలా స్పెండ్ చేశారు?
కరోనా కారణంగా వచ్చిన ఈ ఖాళీ సమయాన్ని నా వరకు నేను క్రియేటివ్‌గా మరింత ముందుకు వెళ్ళడానికి ఉపయోగించుకున్నా. స్టోరీ డిస్కషన్స్, కొన్ని కొత్త కథలు రాసుకున్నా, ముందు మాదిరిగా ఒక స్టోరీ తరువాత మరో స్టోరీని రెడీ చేసే పద్ధతి నుంచి కాస్త బయట పడ్డాను. ఇప్పుడు నా చేతిలో ఒక మూడు నాలుగు కథలు ఉన్నాయి. అన్ని సెట్స్ మీదకి తీసుకు రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

కోవిడ్ ఇండస్ట్రీ మీద ఎలాంటి ప్రభావం చూపించింది అనుకుంటున్నారు?
ప్రొడక్షన్ పరంగా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ, ఆడియన్స్ సినిమాలు చూడటం ఆపలేదు, కొత్త కొత్త జోనర్స్ చూస్తూ ఉన్నారు, ఐతే సినిమా నిర్మాణంలో ఆర్ధిక పరమైన ఇబ్బందులు వచ్చాయి, అవి కూడా ఇప్పుడు ఓవర్ కం అయ్యి అంతా సాధారణ స్థితికి వచ్చింది అని నేను భావిస్తున్నా.



50 శాతం ఆడియన్స్‌తో థియేటర్స్‌ తెరవచ్చు అని ఆమోదం వచ్చింది, ఇది ఎలాంటి పరిణామంగా భావించవచ్చు?
అసలు లేకపోవడం కంటే ముందు ఒకరు వచ్చినా బొమ్మ వేయడం మొదలు పెట్టడం నయం కదా, ఇప్పుడు 50 శాతం ఆడియన్స్‌తో థియేటర్స్ నడిపించే అవకాశం దొరికింది, ఇది కచ్చితంగా శుభ పరిణామం, జనవరికి 100 శాతం ఆడియన్స్‌తో థియేటర్స్ తెరిచే పరిస్థితి వస్తుంది అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా.

మీ అప్‌కమింగ్ మూవీస్ గురించి చెప్పండి?
నా మాతృ సంస్థలు యూవీ క్రియేషన్స్, గీత ఆర్ట్స్ కాంబినేషన్‌లో ఓ సినిమా చేస్తున్నా. ఫిబ్రవరి నుంచి షూటింగ్‌కి వెళ్లబోతున్నాం. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ లైన్‌లో ఉన్నాయి. త్వరలోనే ఆ విషయాలు కూడా వెల్లడిస్తాను.

వెబ్ లోకి ఎంటర్ అవుతున్నారు అని తెలిసింది, నిజమేనా?
ఓ వెబ్ సిరీస్‌కి స్టోరీ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నా, ఇది ఓ కొత్త టీం చేస్తున్నారు.
OTT ల ప్రభావంతో థియేటర్స్‌కి దెబ్బ అనే వాదన గురుంచి ఏమంటారు?
ఎన్ని వచ్చినా థియేటర్స్ అనుభూతి ఏది ఇవ్వలేదు, ఐతే ఓటీటీ కారణంగా కూడా ఉపయోగాలు ఉన్నాయి. టాలెంట్ ఉన్న కొత్తవారు వస్తున్నారు. కొత్త కథలు, కొత్త రకమైన ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్‌కి అందుతుంది.