దేశంలో కరోనా.. 6727కి చేరిన కేసులు.. తెలుగు రాష్ట్రాల్లో!

  • Published By: vamsi ,Published On : April 10, 2020 / 03:11 AM IST
దేశంలో కరోనా.. 6727కి చేరిన కేసులు.. తెలుగు రాష్ట్రాల్లో!

Updated On : April 10, 2020 / 3:11 AM IST

కరోనా మహమ్మారి అనుకున్న దానికంటే కూడా ఎక్కువ స్థాయిలోనే  మన దేశంపై ప్రభావం చూపిస్తుంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 6727కి చేరుకున్నాయి. కరోనా వైరస్‌ బారిన పిడి ఇప్పటి వరకు 231 మంది చనిపోయారు.

 వైరస్‌ బారి నుంచి 596 మంది కోలుకోగా.. మహారాష్ట్రలో అత్యధికంగా 1,364 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 97 మంది చనిపోగా 125 మంది కోలుకున్నారు. తమిళనాడులో 834 మంది వైరస్‌బారిన పడగా..  8 మంది చనిపోయారు. 

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్‌ బాధితుల సంఖ్య 720కి చేరుకుంది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు 426కి చేరుకోగా, 33 మంది చనిపోయారు. రాజస్తాన్‌లో 463 మంది వైరస్‌ బారిన పడగా, ఏడుగురు చనిపోయారు. ఉత్తరప్రదేవ్‌ రాష్ట్రంలో 410 కేసులు నమోదు అవగా..  31 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కేరళలో 357కి కేసులు నమోదవగా..  97 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 

ఇక తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 471కి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 363కి చేరుకుంది. 

Also Read | ముంబాయిపై కరోనా పడగ : భవనాలు, స్కూళ్లు, స్టేడియాలు క్వారంటైన్ కేంద్రాలు