COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 1,946 మందికి కరోనా.. 25,968 యాక్టివ్ కేసులు

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య అతి తక్కువగా నమోదవుతోంది. నిన్న దేశంలో 1,946 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 2,417 మంది కోలుకున్నారని చెప్పింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 4,40,79,485 మంది కోలుకున్నారని వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.75 శాతంగా ఉందని చెప్పింది.

COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 1,946 మందికి కరోనా.. 25,968 యాక్టివ్ కేసులు

india corona cases

Updated On : October 19, 2022 / 11:04 AM IST

COVID-19 UPDATE: దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య అతి తక్కువగా నమోదవుతోంది. నిన్న దేశంలో 1,946 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 2,417 మంది కోలుకున్నారని చెప్పింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 4,40,79,485 మంది కోలుకున్నారని వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.75 శాతంగా ఉందని చెప్పింది.

వారాంతపు పాజిటివిటీ రేటు 1.01 శాతంగా ఉందని తెలిపింది. ప్రస్తుతం దేశంలో 25,968 మంది ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. కరోనా రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని చెప్పింది. ఇప్పటివరకు దేశంలో 219.41 కోట్ల కరోనా డోసులు వినియోగించారని, వాటిలో 94.97 కోట్ల రెండో డోసులు ఉన్నాయని చెప్పింది.

బూస్టర్ డోసుల సంఖ్య 21.92 కోట్లు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. నిన్న దేశంలో 3,76,787 కరోనా డోసులు వేసినట్లు తెలిపింది. దేశంలో ఇప్పటివరకు 89.91 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది. నిన్న 2,60,806 కరోనా పరీక్షలు చేసినట్లు తెలిపింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..