సర్వం సిద్ధం: రెండో విడత పోలింగ్​ ప్రారంభం

  • Published By: vamsi ,Published On : December 7, 2019 / 02:24 AM IST
సర్వం సిద్ధం: రెండో విడత పోలింగ్​ ప్రారంభం

Updated On : December 7, 2019 / 2:24 AM IST

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్​ ప్రారంభం అయ్యింది. తొలి విడతలో భాగంగా ఆరు జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరగగా.. రెండవ విడతలో భాగంగా 20 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్‌ ప్రారంభం అయ్యింది. ఈ విడతలో 260 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 47లక్షల మంది ఓటర్లు ఓటింగ్‌‌లో పాల్గొంటారు.

42 వేల మందితో ఎన్నికలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం అవగా.. 18 నియోజకవర్గాల్లో సాయంత్రం 3 గంటల వరకు, మరో రెండు చోట్ల సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. ముఖ్యమంత్రి రఘువర్‌ దాస్‌, శాసనసభ స్పీకర్‌ దినేష్‌ ఓరాన్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ గిలువా వంటి ప్రముఖులు రెండోవిడత ఎన్నికల బరిలో ఉన్నారు. రఘుబర్‌ దాస్‌.. జమ్‌షేడ్‌పూర్‌ తూర్పు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

జార్ఖండ్ రాష్ట్రంలో మరోసారి గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. 2000లో ప్రత్యేక రాష్ట్రంగా జార్ఖండ్ ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవి నాలుగో అసెంబ్లీ ఎన్నికలు. నక్సల్స్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌తో కలిసి పోటీ చేసిన బీజేపీ 43 స్థానాల్లో గెలిచి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ 37 స్థానాల్లో విజయం సాధించింది.  

> జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలన్నాయి. 
> జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు కలిసి మహాకూటమిగా పోటీ చేస్తున్నాయి. ఐదు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.
> తొలి దశ ఎన్నికల్లో 189 మంది అభ్యర్థులు నిలబడగా.. రెండవ దశలో 260 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 
> 3 వేల 906 పోలింగ్ కేంద్రాలున్నాయి. 
> 2020 జనవరి 05తో రాష్ట్రంలో ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది. 
> నవంబర్ 30న తొలి దశ పోలింగ్. 
> డిసెంబర్ 07న రెండో దశ. 
> డిసెంబర్ 12న మూడో దశ. 
> డిసెంబర్ 16న నాలుగో దశ.
> డిసెంబర్ 20న ఐదో దశ.
> డిసెంబర్ 23న ఎన్నికల ఫలితాలు.