కేంద్రం కొత్త స్కీమ్ : చిన్న పారిశ్రామికవేత్తల అప్పులు మాఫీ
చిన్న పారిశ్రామికవేత్తలకు గుడ్ న్యూస్. నరేంద్ర మోడీ ప్రభుత్వం యూనివర్శల్ డెబ్ట్ రిలీఫ్ స్కీంను ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది.

చిన్న పారిశ్రామికవేత్తలకు గుడ్ న్యూస్. నరేంద్ర మోడీ ప్రభుత్వం యూనివర్శల్ డెబ్ట్ రిలీఫ్ స్కీంను ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది.
చిన్న పారిశ్రామికవేత్తలకు గుడ్ న్యూస్. నరేంద్ర మోడీ ప్రభుత్వం యూనివర్శల్ డెబ్ట్ రిలీఫ్ స్కీంను ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. చిన్న రుణాదారులకు సాయం చేయడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. రుణమాపీ పథకం ద్వారా.. చిన్న రైతులు, కళాకారులు, చిన్న పారిశ్రామికవేత్తలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఈ కొత్త ప్లాన్ అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండగా.. మే 23, 2019న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.
ఎవరికైతే వ్యక్తిగత వార్షిక ఆదాయం రూ.60వేల కంటే తక్కువ ఉంటుందో వారు పథకం కింద లబ్ధి పొందవచ్చు. రూ.35వేల కంటే తక్కువ రుణాలు, ఆస్తుల విలువ రూ.20వేలు అంతకంటే తక్కువ ఉన్నవారే ఈ పథకాన్ని అర్హులువుతారు. దీనిపై కార్పొరేట్ అఫైర్ సెక్రటరీ ఇంజేటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. యూనివర్శల్ డెబ్ట్ రిలీఫ్ స్కీమ్ ను ప్రత్యేకించి పేదవారి కోసం ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. ఈ పథకం అమలుపై మినిస్టరీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (MCA) పనిచేస్తోందని అన్నారు. ఈ పథకం అమలుకు అయ్యే ఖర్చును రూ.20వేల కోట్ల కంటే అధికంగా ఉండే అవకాశం లేదన్నారు.
చిన్న మొత్తంలో రుణాలు తీసుకున్న వారికి మిలియన్ల బెనిఫెట్స్ అందే అవకాశం ఉందని చెప్పారు. రుణం పొంది తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నవారి కోసం బ్యాంక్రప్టీ బోర్డ్ ఆఫ్ ఇండియా (IBBI)అండగా ఉండి వారిని రుణాల నుంచి విముక్తి కలిగించేలా చేయూతనిస్తోందన్నారు. వ్యక్తిగత వార్షిక ఆదాయం పొందే వారంతా ఈ స్కీమ్ నుంచి బెనిఫెట్స్ పొందవచ్చునని, తమ క్రెడిట్ హిస్టరీ ఆధారంగా లబ్ధి పొందే అవకాశం ఉందని తెలిపారు.