Cycle Girl : విషాదంలో ఉన్న”సైకిల్ గర్ల్” జ్యోతికి ప్రియాంక అండ

గతేడాది లాక్​డౌన్​ వేళ తన తండ్రిని సైకిల్​పై ఎక్కించుకుని 1300 కి.మీ ప్రయాణించి 'సైకిల్​ గర్ల్​'గా గుర్తింపు పొందిన బీహార్ కు చెందిన జ్యోతి కుమారి ఇంట్లో ఇటీవల విషాదం నెలకొన్న విషయం తెలిసిందే.

Cycle Girl :  విషాదంలో ఉన్న”సైకిల్ గర్ల్” జ్యోతికి ప్రియాంక అండ

Priyanka Gandhi To Bear Education Expense Of Cycle Girl After Her Fathers Death

Updated On : June 4, 2021 / 6:29 PM IST

Cycle Girl గతేడాది లాక్​డౌన్​ వేళ తన తండ్రిని సైకిల్​పై ఎక్కించుకుని 1300 కి.మీ ప్రయాణించి ‘సైకిల్​ గర్ల్​’గా గుర్తింపు పొందిన బీహార్ కు చెందిన జ్యోతి కుమారి ఇంట్లో ఇటీవల విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. సైకిల్ గర్ల్ జ్యోతి తండ్రి మోహ‌న్ పాశ్వాన్‌ సోమవారం గుండెపోటుతో మరణించారు. అయితే తండ్రిని కోల్పోయి తీవ్ర దు:ఖంలో ఉన్న జ్యోతిని ఆదుకునేందుకు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ముందుకొచ్చారు.

జ్యోతి కుమారి తండ్రి మృతి పట్ల ప్రియాంక గాంధీ సంతాపం తెలిపిన ప్రియాంక గాంధీ…జ్యోతి చదువుకయ్యే ఖర్చులు భరించటం సహా ఆమె కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం చేస్తానని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం జ్యోతికుమారితో ప్రియాంకగాంధీ ఫోన్​లో మాట్లాడారు. తాను వ్యక్తిగతంగా ప్రియాంక గాంధీని కలవాలనుకుంటున్నాన్న జ్యోతి వినతికి ఆమె సానుకూలంగా స్పందించారు. ప్రియాంక తరఫున కాంగ్రెస్​ నేత మష్కూర్​ అహ్మద్​ ఉస్మానీ.. జ్యోతి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ప్రియాంక స్వయంగా రాసిన ఓ లేఖను అందజేశారు.

బీహార్ లోని దర్భంగలోని సిర్హుల్లి గ్రామానికి చెందిన జ్యోతి కుమారి తండ్రి మోహన్ పాసవాన్.. గుర్​గ్రామ్​​లో​ ఆటో డ్రైవర్​గా పనిచేసేవాడు. గతేడాది లాక్ డౌన్ ప్రకటించడానికి కొద్ది రోజుల ముందు జరిగిన రోడ్డు ప్రమాదం​ వల్ల అతని మోకాలికి బలమైన గాయం అయింది. ఆయన్ను చూడటానికి కుమార్తె జ్యోతి బీహార్ నుంచి గురుగ్రామ్ వచ్చింది. ఆతర్వాత కొద్దిరోజులకే లాక్‌డౌన్ ప్రకటించటంతో తండ్రీ,కూతుళ్లు అక్కడే చిక్కుకు పోయారు. ప్రమాదం కారణంగా మోహన్ నడిచే పరిస్ధితి లేదు. ఉపాధిలేక పూట గడవడం కష్టంగా మారింది. ఇంటి అద్దెకూడా చెల్లించలేని పరిస్ధితి ఏర్పడింది. ఇల్లు ఖాళీచేయమని యజమాని ఒత్తిడి చేశాడు. దీంతో తండ్రితో సహా సొంత గ్రామానికి చేరుకోవాలని నిశ్చయించుకున్న జ్యోతి.. పాత సైకిల్​ కొని దాంతో గ్రామానికి చేరుకుంది. జ్యోతి సాహసానికి గాను ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్​ పురస్కార్​-2021 ఆమెను వరించింది. వర్చువల్​గా జరిగిన ఈ బహుమతి ప్రదానోత్సవంలో.. జ్యోతి ధైర్యాన్ని ప్రధాని మోడీ ప్రశంసించారు. బీహార్ ప్రభుత్వం ఆమెను డ్రగ్​ డీఆడిక్షన్​ ప్రచార కార్యక్రమానికి బ్రాండ్​ అంబాసిడర్​గా నియమించింది.