Tirumala : తిరుమల పాలకమండలి ముఖ్య నిర్ణయాలు

జన‌వ‌రి 13వ తేదీ నుంచి 10 రోజుల పాటు తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం క‌ల్పించాల‌ని టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది.

Tirumala : తిరుమల పాలకమండలి ముఖ్య నిర్ణయాలు

Ttd

Updated On : December 11, 2021 / 6:41 PM IST

Tirumala Governing Body : వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా 2022, జ‌న‌వ‌రి 13వ తేదీ నుంచి 10 రోజుల పాటు తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం క‌ల్పించాల‌ని టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం తరహాలోనే వెనుకబడిన ప్రాంతాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకారులకు ఉచితంగా వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ధర్మకర్తల మండలి వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన అధ్యక్షతనలో శ‌నివారం తిరుమల అన్నమయ్య భవనంలో పాలక మండలి సమావేశం జరిగింది. సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు ఈ విధంగా ఉన్నాయి.

Read More : TTD : ఆకాశగంగ తీర్థ అభివృద్ధికి ఆనందసాయి సహకారం

‘క‌రోనా నిబంధ‌న‌లు స‌డ‌లిస్తే కొత్త సంవ‌త్స‌రంలో మ‌రింత ఎక్కువ మంది భ‌క్తుల‌ను స‌ర్వ‌ద‌ర్శ‌నానికి అనుమ‌తించ‌డంతో పాటు ప‌రిమిత సంఖ్య‌లో భ‌క్తుల‌ను శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల‌కు అనుమ‌తించాలని…ఇందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలకు లేఖలు రాయాల‌ని నిర్ణ‌యం. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు శ్రీ వేంకటేశ్వర తత్వాన్ని ప్రచారం చేసేందుకు శ్రీ వేంకటేశ్వర నామకోటి పుస్తకాలు. శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయాన్ని సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రిగా మార్చేందుకు స్థ‌లాన్ని గుర్తింపు. వెంట‌నే ఆసుప‌త్రి నిర్మాణం చేప‌ట్టాలి. ఇందుకోసం ఎస్వీ ప్రాణ‌దాన ట్ర‌స్టు ద్వారా విరాళాలు అందించే దాత‌ల‌కు ఉద‌యాస్త‌మాన సేవా టికెట్లు కేటాయించడం. తిరుమ‌లలో హ‌నుమంతుని జ‌న్మ‌స్థ‌లమైన అంజ‌నాదేవి ఆల‌య ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం. నాద‌నీరాజ‌నం వేదికను భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా తీర్చిదిద్దేందుకు మండ‌పం నిర్మాణం. ఈ రెండింటిని దాత‌ల విరాళాల‌తో నిర్మించాల‌ని నిర్ణ‌యం.

Read More : TTD Board Meeting : తిరుమలకు మూడో దారి…అన్నమయ్య మార్గంపై టీటీడీ ఫోకస్

అన్న‌మ‌య్య కాలిబాట మార్గాన్ని మ‌రో న‌డ‌క‌మార్గంగా అభివృద్ధి చేయడం. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న శ్రీవారి మెట్టు మార్గంలో రూ.3.6 కోట్ల వ్యయంతో, రెండో ఘాట్‌ రోడ్డులో రూ.3.95 కోట్ల వ్యయంతో పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు ఆమోదం. భక్తుల తలనీలాలు తీసే కల్యాణకట్ట క్షురకులకు పీస్‌రేట్‌ ఒక్కింటికి రూ.11/- నుండి రూ.15/-కు పెంచేందుకు ఆమోదం. కార్తీక దీపోత్సవం, శ్రీనివాస కల్యాణాలు లాంటి ధార్మిక కార్య‌క్ర‌మాలను తెలుగు రాష్ట్రాల‌తో పాటు ప్ర‌ముఖ న‌గ‌రాల్లో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం.
రూ.3 కోట్ల వ్యయంతో యాత్రికుల సౌకర్యార్థం తిరుమలలోని ఏఎన్సీ, జీఎన్సీ, హెచ్‌ విసి తదితర విశ్రాంతి గృహాల్లో వాటర్‌ హీటర్లు ఏర్పాటుకు గాను టెండర్లకు ఆమోదం.
వైఎస్ఆర్ క‌డ‌ప జిల్లా రాజంపేట స‌మీపంలోని అన్న‌మ‌య్య డ్యామ్ ప‌రివాహ‌క ప్రాంతంలో ధ్వంస‌మైన 7 ఆల‌యాలను పున‌ర్నిర్మించాల‌ని నిర్ణ‌యం.

Read More : TTD : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..దర్శన టికెట్లు పెంచాలని నిర్ణయం

టీటీడీలో పరిపాలన పరమైన పలు నూతన అప్లికేషన్లలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు వీలుగా ఐటి విభాగాన్ని బలోపేతం. రూ.10 కోట్ల వ్యయంతో స్విమ్స్‌ లో సెంట్రల్‌ గోడౌన్‌ భవన నిర్మాణానికి అనుమతి మంజూరు. రూ.12.58 కోట్ల వ్యయంతో శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలోని హరిణి హాస్టల్‌ బ్లాక్‌ లో అదనపు అంతస్థుల నిర్మాణానికి, శ్రీనివాస, గాంధీ హాస్టళ్లలో గదులను ఆధునీకరణ చేసేందుకు టెండర్లకు ఆమోదం. రూ.2.80 కోట్లతో తిరుమలలో నిర్మాణంలో ఉన్న‌ పరకామణి భ‌వ‌నంలో నాణేలను లెక్కించి ఆటోమేటిక్‌గా ప్యాకింగ్‌ చేసేందుకు వీలుగా రెండు యంత్రాల ఏర్పాటుకు టెండర్లు పిలవాలని నిర్ణయం. శ్రీశైలంలోని శ్రీశైల దేవస్థానం శివాజీ గోపురానికి రాగి కళశాలపై బంగారు తాపడం చేసి అందించేందుకు ఆమోదం. ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో శ్రీ వేంకటేశ్వర తాళపత్ర గ్రంథ ప్రాజెక్టు ఏర్పాటు’.

Read More : Papagni River Bridge : పాపాఘ్ని నదిపై నడక దారికి ఏర్పాట్లు

ఇక పాలకమండలి సమావేశంలో టీటీడీ ఈవో డాక్ట‌ర్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి, దేవాదాయ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి వాణి మోహ‌న్‌, బోర్డు స‌భ్యులు డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ హరిజవహర్ లాల్, ఐదుగురు బోర్డు స‌భ్యులు వ‌ర్చువ‌ల్‌గా పాల్గొన్నారు. అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవోలు స‌దా భార్గ‌వి, వీర‌బ్ర‌హ్మ‌య్య‌, సీవీఎస్వో గోపినాథ్ జెట్టి పాల్గొన్నారు.