India tour of England : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టెస్టు మ్యాచుల సిరీస్.. షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ
వచ్చే ఏడాది జూన్లో ఇంగ్లాండ్తో జరగనున్న ఐదు మ్యాచుల టెస్టు సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ, ఈసీబీలు సంయుక్తంగా ప్రకటించాయి.

Indias tour of England 2025 BCCI announces full IND vs ENG schedule
India tour of England 2025 : వచ్చే ఏడాది జూన్లో ఇంగ్లాండ్తో జరగనున్న ఐదు మ్యాచుల టెస్టు సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ), ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) లు సంయుక్తంగా ప్రకటించాయి. జూన్ నుంచి ఆగస్ట్ మధ్య ఈ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్తోనే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) నాలుగో సైకిల్ ప్రారంభం కానుంది.
ఈ సిరీస్కు కెప్టెన్గా రోహిత్ శర్మనే వ్యహరించనున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇంగ్లాండ్, భారత జట్ల మధ్య ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ 2021లో చివరి సారిగా జరిగింది. అప్పుడు ఓ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగియగా, 2-2తో సిరీస్ సమమైంది.
Cristiano Ronaldo : యూట్యూబ్లో రొనాల్డో సంచలనం.. 90 నిమిషాల్లోనే మిలియన్..
షెడ్యూల్ ఇలా..
మొదటి టెస్టు : జూన్ 20 నుంచి 24 వరకు లీడ్స్లో
రెండో టెస్ట్ : జూలై 2 నుంచి 6 వరకు బర్మింగ్హామ్లో
మూడో టెస్ట్ : జూలై 10 నుంచి 14 వరకు లార్డ్స్లో
నాలుగో టెస్టు : జూలై 23 నుంచి 27 వరకు మాంచెస్టర్లో
ఐదో టెస్టు : జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు ఓవల్లో
Announced! ?
A look at #TeamIndia‘s fixtures for the 5⃣-match Test series against England in 2025 ?#ENGvIND pic.twitter.com/wS9ZCVbKAt
— BCCI (@BCCI) August 22, 2024