Rohit Sharma : హిట్ మ్యాన్కు విశ్రాంతి.. సిడ్నీ టెస్టులో రోహిత్ శర్మ స్థానంలో బుమ్రాకు జట్టు పగ్గాలు..?
Rohit Sharma : నివేదిక ప్రకారం.. రోహిత్ శర్మ స్థానంలో పేస్మెన్ జస్ప్రీత్ బుమ్రా జనవరి 3న జరుగనున్న చివరిదైన సిడ్నీ టెస్టులో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు.

Jasprit Bumrah to lead India in BGT finale (Image Source : Google )
Rohit Sharma : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT)లో చివరిదైన ఐదో టెస్టుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోనున్నాడు. జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరగనున్న ఈ నిర్ణయాత్మక మ్యాచ్లో రోహిత్ ప్లేయింగ్ ఎలెవన్లో ఆడే పరిస్థితి కనిపించడం లేదు. మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన నుంచి రిటైర్మెంట్ వరకు మీడియాలో అనేక పుకార్లు వినిపించాయి. ఇప్పటికే, ఈ మ్యాచ్ తాను ఆడబోనని సెలెక్టర్లతో రోహిత్ శర్మ చెప్పినట్లు ఓ నివేదిక తెలిపింది. ఇప్పుడు సిడ్నీ టెస్టులో హిట్మ్యాన్ ఆడించకూడదని సెలెక్టర్లు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. కానీ, రోహిత్ రిటైర్మెంట్పై ఎలాంటి ధృవీకరణ లేదు.
Read Also : Khel Ratna Award : మనుభాకర్, గుకేశ్తో పాటు మరో ఇద్దరికి ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు..
రోహిత్ స్థానంలో కెప్టెన్ ఎవరు? :
నివేదిక ప్రకారం.. రోహిత్ శర్మ స్థానంలో పేస్మెన్ జస్ప్రీత్ బుమ్రా శుక్రవారం ఉదయం (జనవరి 3) సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ)లో జట్టు కెప్టెన్గా పగ్గాలు అందుకునే అవకాశం ఉంది. ఈ సిరీస్లో, పెర్త్లో జరిగిన సింగిల్ టెస్ట్ మ్యాచ్లో మాత్రమే భారత్ గెలిచింది. ఆ మ్యాచ్లో కూడా రోహిత్ లేకపోవడంతో బుమ్రా కెప్టెన్సీని అందుకోనున్నాడు. గత ఏడాది పొడవునా బ్యాటింగ్లో రోహిత్ శర్మ విఫలమవుతూనే ఉన్నాడు.
ప్రస్తుత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ పేలవ ప్రదర్శనతో ఆడిన 5 ఇన్నింగ్స్ల్లో 6.20 సగటుతో 31 పరుగులు మాత్రమే చేశాడు. అందిన నివేదిక ప్రకారం.. కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్టర్ల ఛైర్మన్ అజిత్ అగార్కర్కు రోహిత్ తాను వైదొలిగే నిర్ణయాన్ని తెలియజేసినట్లు సమాచారం. అందుకు సెలెక్టర్లు కూడా అంగీకరించినట్లు తెలిసింది. సమ్మర్లో ఇంగ్లండ్ పర్యటనతో ప్రారంభమయ్యే తదుపరి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్, మెల్బోర్న్లో జరిగే బాక్సింగ్ డే టెస్టు రోహిత్ చివరిది కానుంది.
తుదిజట్టులోకి శుభ్మన్ గిల్ :
మెల్బోర్న్ టెస్టు నుంచి తొలగించిన శుభ్మన్ గిల్ తుది జట్టులోకి రానున్నాడు. అతను మూడవ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. అయితే, కేఎల్ రాహుల్ యశస్వి జైస్వాల్తో కలిసి ఇన్నింగ్స్ను ప్రారంభించనున్నాడు. రిషబ్ పంత్ జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకోనున్నాడు. గాయపడిన ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ కూడా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. మ్యాచ్ ముందురోజు ప్రాక్టీస్ సమయంలో ఫీల్డింగ్ జరుగుతున్నప్పుడు గంభీర్ బుమ్రాతో చర్చలు జరుపుతున్నట్లు కనిపించాడు.
రోహిత్ నెట్స్ వద్ద కొద్దిసేపు కనిపించాడు. సైడ్-ఆర్మ్ బౌలర్లతో బ్యాటింగ్ చేశాడు. అంతకుముందు రోజు, ప్లేయింగ్ 11లో రోహిత్ స్థానం గురించి గంభీర్ని ప్రశ్నించగా.. ‘రోహిత్తో అంతా బాగానే ఉంది. మేం వికెట్ను పరిశీలించి, ప్లేయింగ్ ఎలెవన్ని రేపు ప్రకటిస్తాము’ అని గంభీర్ పేర్కొన్నాడు. అత్యంత ముఖ్యమైన ఐదో టెస్టులో జట్టు పగ్గాలు అందుకునేందుకు బుమ్రాకు మరో అవకాశం. ఈ సిరీస్ను 2-2తో సమం చేసి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని నిలబెట్టుకోవడానికి భారత్ తప్పక గెలవాల్సిన మ్యాచ్ కావడంతో మరింత ఆసక్తి నెలకొంది.
2024లో టెస్టు కెప్టెన్ రోహిత్ ప్రదర్శన :
రోహిత్ శర్మ గతేడాది 14 మ్యాచ్ల్లో 24.76 సగటుతో రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలతో 619 పరుగులు మాత్రమే చేశాడు. 2024 మార్చిలో ఇంగ్లండ్పై 103 పరుగులు చేసినప్పటి నుంచి రోహిత్ పరుగుల కోసం కష్టపడుతున్నాడు. ధర్మశాలలో ఆ సెంచరీ తర్వాత, రోహిత్ బెంగళూరులో న్యూజిలాండ్పై 52 పరుగులతో సహా 15 ఇన్నింగ్స్లలో 10.26 సగటుతో కేవలం 154 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
Read Also : Glenn Maxwell : న్యూ ఇయర్ తొలి రోజునే.. క్రికెట్ చరిత్రలోనే గొప్ప క్యాచ్ అందుకున్న మాక్స్వెల్..