తెలంగాణలో కొత్తగా 1,879 కరోనా కేసులు, ఏడుగురు మృతి

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనేవుంది. తెలంగాణలో కొత్తగా 1,879 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనాతో మరో ఏడుగురు మృతి చెందారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27,612 కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 313 మంది మృతి చెందారు.
తెలంగాణలో మరో 1,506 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో 11,012 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 16, 287 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మంగళవారం రాష్ట్రంలో 6,220 శాంపిల్స్ పరీక్షించగా 1879 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,28,438 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.
జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,422 కరోనా కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డి 176, మేడ్చల్ 94, కరీంనగర్ 32, నల్గొండ 31, నిజామాబాద్ 19, వరంగల్ అర్బన్ 13, మెదక్ 12, ములుగు 12, మహబూబ్ నగర్ 11, సూర్యాపేట 9, సంగారెడ్డి 9, కామారెడ్డి 7, జయశంకర్ భూపాలపల్లి 6, గద్వాల్ 4 కేసులు నమోదు అయ్యాయి.
పెద్దపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడేసి కరోనా కేసులు నమోదు అయ్యాయి. జగిత్యాల, మహబూబాద్, రాజన్నసిరిసిల్ల, నాగర్ కర్నూల్ జిల్లాలో 2 కేసులు, వనపర్తి, సిద్దిపేట, ఆదిలాబాద్, జనగామ, వికారాబాద్ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.
Read Here>>టీకాంగ్రెస్ నేతల్లో సమన్వయలోపం.. ఇదే టీఆర్ఎస్కు కలిసొచ్చిందా?