BRS Leader KTR : నెల రోజుల కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌ల‌ను మార్చుంటే బాగుండేది!

2014లో అనివార్యంగా ఒంటరిగా పోటీ చేశాం. అప్పుడు సంస్థాగతంగా పార్టీబలంగా లేకపోయినా ప్రజలు మనల్ని దీవించారు. ఇప్పుడు 119 సీట్లలో 39 సీట్లు గెలిచాం. ఇది తక్కువ సంఖ్య కాదు.. మూడింట ఒకవంతు సీట్లు గెలిచామని కేటీఆర్ అన్నారు.

BRS Leader KTR : నెల రోజుల కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌ల‌ను మార్చుంటే బాగుండేది!

KTR

Updated On : January 7, 2024 / 2:19 PM IST

KTR : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు అవుతుంది. ఈ నెల రోజుల పాలనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట మూటగట్టుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే ప్రజల నుంచి నిరసన సెగలు మొదలయ్యాయని కేటీఆర్ అన్నారు. ఆదివారం పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.. అప్పుల బూచీ చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగబోతుందని, ఈ మూడు ముక్కలాటలో మనకే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని, కేసీఆర్ పట్ల సానుభూతి, కాంగ్రెస్ కు దూరమైన వర్గాలు పార్లమెంట్ ఎన్నికల్లో మన విజయానికి బాటలు వేస్తాయని కేటీఆర్ అన్నారు.

Also Read : CM Revanth Reddy : ముఖ్యమంత్రిగా నెలరోజుల పాలనపై రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్.. ఏమన్నారంటే?

‘బంధు’ పథకాల ప్రభావం పడింది ..
2014లో అనివార్యంగా ఒంటరిగా పోటీ చేశాం. అప్పుడు సంస్థాగతంగా పార్టీబలంగా లేకపోయినా ప్రజలు మనల్ని దీవించారు. ఇప్పుడు 119 సీట్లలో 39 సీట్లు గెలిచాం. ఇది తక్కువ సంఖ్య కాదు.. మూడింట ఒకవంతు సీట్లు గెలిచామని కేటీఆర్ అన్నారు. జుక్కల్ లో షిండే ఓడిపోతారని అస్సులు ఊహించలేదు.. కేవలం 1100 ఓట్లతో ఓడిపోయారు. నారాయణ్ ఖేడ్ నుంచి వచ్చిన కాంగ్రెస్ నేత జుక్కల్ లో గెలిచారు. ఇలాంటి విచిత్రాలు చాలా జరిగాయని కేటీఆర్ పేర్కొన్నారు. దళిత బంధు నిజాంసాగర్ మండలంలో మొత్తం ఇచ్చినా మిగతా వర్గాలు మనకు ఓట్లు వేయలేదు. ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష పడేలా సమాజం తయారైంది. ‘బంధు’ పథకాల ప్రభావం మనపై పడిందని, కొత్త ఒక వింత.. పాత ఒక రోతలా ప్రజలు భావించారని కేటీఆర్ అన్నారు.

Also Read : TDP Leader B Tech Ravi : బ్రదర్ అనిల్‌ను కలవడంపై స్పందించిన బీటెక్ రవి.. సీఎం జ‌గ‌న్‌పై సంచలన వ్యాఖ్యలు

పార్లమెంట్ లో త్రిముఖ పోటీ..
నెల రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట మూటగట్టుకుంది. మనం తెచ్చిన పథకాలు రద్దు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నిరసన సెగలు మొదలయ్యాయి. జిల్లాల సంఖ్య తగ్గించేందుకు రేవంత్ రెడ్డి కమిషన్ వేస్తామంటున్నారు. కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా?. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ సిట్టింగ్ లను మార్చిఉంటే బాగుండేది. పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వం అని కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగబోతుంది.. జహీరాబాద్ పార్లమెంట్ సీటును కచ్చితంగా మనం గెలుస్తామని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మీద విమర్శలు విషయంలో బీఆర్ఎస్ నుంచి తొందరపడలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేసిన అభివృద్ధిని తక్కువచేసి చూపి అప్పులపాలు చేశామని కాంగ్రెస్ వాళ్లే మొదట దాడి మొదలు పెట్టారు. కాంగ్రెస్ నేతలు మనల్ని విమర్శిస్తే వదిలి పెట్టే ప్రసక్తే లేదంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Also Read : Telangana Congress Party : పార్లమెంట్ ఎన్నికలపై సీఎం రేవంత్ ఫోకస్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరాంకు చాన్స్

ఎత్తులు పల్లాలు తప్పవు..
పార్టీ అన్నప్పుడు ఎత్తులు పల్లాలు తప్పవు. 2009లో పది అసెంబ్లీ సీట్లే గెలిచాం. కేవలం ఆరు నెలల్లోనే కేసీఆర్ దీక్షతో అప్పుడు పరిస్థితి మారింది. గులాబీ జెండా అంటే గౌరవం పెరిగింది. 1985 – 89 మధ్య ఎన్టీఆర్ ఎన్నో మంచి పథకాలు తెచ్చినా ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. 1989లో ఓడిపోయిన టీడీపీ ఆ తరువాత మొదటి విడతలో జరిగిన 21 ఎంపీ సీట్ల ఎన్నికల్లో 19 గెలిచింది. మొన్న కాంగ్రెస్ కు ఓటేసిన వాళ్లు కూడా ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. కాంగ్రెస్ 420 హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ఒత్తిడి పెంచుదాం అంటూ కేటీఆర్ బీఆర్ఎస్ క్యాడర్ కు సూచించారు. గతంలో తెలంగాణ పదాన్ని నిషేదించారు. తెలంగాణకోసం కడుపు చించుకుని కోట్లాడేది బీఆర్ఎస్ మాత్రమే. బీఆర్ఎస్ బలంగా లేకపోతే తెలంగాణ పదం మాయం చేసేందుకు పార్టీలు సిద్ధంగా ఉన్నాయని కేటీఆర్ అన్నారు.