Minister Niranjan Reddy : ఒక్క గుంట భూమి ఎక్కువున్నా నా పదవికి రాజీనామా చేస్తా.. లేకుంటే నీవు నీ పదవికి రాజీనామా చేయాలి : మంత్రి నిరంజన్ రెడ్డి
రాజకీయంగా ఎదుర్కునే శక్తి లేక బురదజల్లే కార్యక్రమం మొదలుపెట్టారని మండిపడ్డారు. గత ఎన్నికలలోనూ ఇలాంటి ప్రచారమే చేశారని.. ఇప్పుడు అదే మొదలుపెట్టారని వెల్లడించారు. 40 ఏళ్ల న్యాయవాద, రాజకీయ చరిత్రలో అక్రమాలకు, తప్పుడు చర్యలకు తాను పాల్పడలేదన్నారు.

Minister Niranjan Reddy
Minister Niranjan Reddy : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపణలపై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు మంత్రి ప్రెస్ నోట్ విడుదల చేశారు. తమ స్వగ్రామం పాన్ గల్ లో తనకు ఉన్న భూములు 2014, 2018 ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నవేనని.. ఆ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నది తన సతీమణి సొంత డబ్బులు, బ్యాంకులోనుతో నిర్మించుకున్న ఇల్లు అని పేర్కొన్నారు.
విదేశాల్లో చదువుకుని, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న మేజర్లు అయిన తమ ఇద్దరు అమ్మాయిలు స్వార్జితంతో చండూరులో సురవరం ప్రతాపరెడ్డి వారసుల నుండి, ఇతరుల నుండి చట్టబద్దంగా భూములు ఖరీదు చేశారని, ఎస్టీల పేరు మీద కొని తర్వాత మార్చుకున్నారని ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు, ఏదో రంధ్రాన్వేషణ చేసినట్లు తొలుత భూములు కొని ఎస్టీల పేరు మీదకు .. తర్వాత మంత్రి కుటుంబ సభ్యుల పేరు మీదకు వెళ్లాయని రఘునందన్ రావు అన్నారు.
Raghunandan Rao: మంత్రి నిరంజన్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
తల్లితండ్రులను కోల్పోయిన పసిబాలుడు గౌడ నాయక్ ను చేరదీసి ఇంట్లో పెట్టుకుని పెంచి పెద్దచేసి ఉన్నత చదువులు చదివించింది వనపర్తి నియోజకవర్గం అంతా తెలుసు .. తను తమ కుటుంబసభ్యుడే .. ప్రస్తుతం ఇంటి వ్యవహారాలు చూసుకునేది అతడేనని తెలిపారు. భూములు కొన్న వారితో అగ్రిమెంట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి విదేశాల్లో ఉన్న పిల్లలు కరోనా నేపథ్యంలో సకాలంలో రాలేని పరిస్థితులలో గౌడనాయక్ పేరు మీద కొంత భూమి రిజిస్టర్ చేసి తర్వాత పిల్లల పేరు మీదకు మార్చుకున్నట్లు పేర్కొన్నారు.
కనీస సమాచారం లేకుండా రఘునందన్ రావు గుడ్డి ఆరోపణలు చేయడం అవివేకం అన్నారు. దురుద్దేశపూర్వక చేసిన ఆరోపణలపై చట్టపరంగా ముందుకెళ్తామన్నారు. మూడు ఫాంహౌజ్ లు ఉన్నాయని ప్రచారం చేయడం అవివేకమని పేర్కొన్నారు. పశువుల కొట్టాలు, కూలీల రేకుల షెడ్లు కూడా ఫాంహౌజ్ లుగా కనిపిస్తే అది ఆయన అజ్ఞానానికి నిదర్శనం అని మంత్రి ఎద్దేవా చేశారు.
పెద్దమందడి మండలం మోజెర్లలో 50 ఎకరాల భూమి అని ఆరోపించారు .. కానీ అది వెల్టూరు గ్రామ పరిధి …. అక్కడ లండన్ లో డాక్టర్ గా పనిచేస్తున్న తన సొంత మరదలు కవిత, వారి స్నేహితులకు ఉన్న భూమి 11.20 ఎకరాలు మాత్రమేనని తెలిపారు.
Minister Niranjan Reddy : బీజేపీతో చావోరేవో తేల్చుకుంటాం : మంత్రి నిరంజన్ రెడ్డి
అక్కడ ఫాంహౌజ్ లేదు .. కూరగాయల తోటలు ఉన్నాయని వెల్లడించారు. ప్రభుత్వం నుండి ఆ భూమికి ఏ రహదారి మంజూరు కాలేదు.. వారు ఇక్కడ ఉండరు కాబట్టి అప్పుడప్పుడు పర్యవేక్షణకు తాను వెళ్తుంటానని చెప్పారు. ఈ మూడు వ్యవసాయ క్షేత్రాలకు రఘునందన్ రావుకు నచ్చినవాళ్లతో, నచ్చిన సర్వేయర్ ను తీసుకుని రేపే వెళ్లొచ్చు లేదా ఆయనకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్లి సర్వే చేయించుకోవడానికి అంగీకరిస్తున్నానట్లు పేర్కొన్నారు. న్యాయంగా, చట్ట ప్రకారం కొనుగోలు చేసిన దానికన్నా ఒక్క గుంట ఎక్కువ ఉన్నా ఆ భూములను తమ పిల్లలు వదిలేస్తారు.. తాను తన పదవికి రాజీనామా చేస్తాను.. లేకుంటే రఘునందరన్ రావు అక్కడే ఆయన పదవికి రాజీనామా చేసిపోవాలని సవాల్ విసిరారు.
తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం సంఘటనను ఈ భూములకు ముడిపెట్టడం నీచపు ఆరోపణ, జుగుప్సాకరమన్నారు. రికార్డులు మండలస్థాయిలోనే కాదు జిల్లా స్థాయిలో , సీసీఎల్ఎ లో కూడా ఉంటాయి.. ఒకచోట రికార్డులు లేకుంటే మరో కార్యాలయంలో ఉంటాయన్న కనీస పరిజ్ఞానం లేకపోతే ఎలా ? అని ప్రశ్నించారు. రఘునందన్ రావును ఎవరు ఆడిస్తున్నారో తమకు తెలుసని.. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీలు వేరు వేరు కాదు .. రెండు ఒక తాను ముక్కలేనని.. వారి ఎజెండా, కార్యాచరణ ఒక్కటే అని ప్రజలకు తెలుసన్నారు. చాలా ప్రయత్నాలు చేసి తన నియోజకవర్గంలో కొందరిని లోబర్చుకుని వ్యతిరేక కార్యకలాపాలు మొదలుపెట్టారని ఆరోపించారు.
Telangana : ఐటీఐఆర్ ప్రాజెక్టుపై కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలి : బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్
రాజకీయంగా ఎదుర్కునే శక్తి లేక బురదజల్లే కార్యక్రమం మొదలుపెట్టారని మండిపడ్డారు. గత ఎన్నికలలోనూ ఇలాంటి ప్రచారమే చేశారని.. ఇప్పుడు అదే మొదలుపెట్టారని వెల్లడించారు. 40 ఏళ్ల న్యాయవాద, రాజకీయ చరిత్రలో అక్రమాలకు, తప్పుడు చర్యలకు తాను పాల్పడలేదన్నారు. రఘునందన్ రావు భేషరతుగా క్షమాపణ చెప్పాలని.. చట్టబద్ధమైన చర్యలకు సిద్దంగా ఉండాలన్నారు. ఇలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు నిరంజన్ రెడ్డి భయపడరని.. లేనిది ఉన్నట్లుగా చిత్రీకరించి ప్రజల్లో అభాసుపాలు చేయాలనుకోవడం అవివేకం అన్నారు.
రఘునందన్ రావు తనను తాను ఎక్కువ ఊహించుకుని ఆరోపణలు చేస్తే ఇక్కడ భరించడానికి ఎవరూ సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. 1985 నుండే ఆదాయపు పన్ను చెల్లించిన న్యాయవాదిని తాను.. స్థాయిని మించి మాట్లాడేటప్పుడు రఘునందన్ రావు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని హితవుపలికారు. నిజానిజాలు తెలుసుకోకుండా రాజకీయ దుగ్దతో చేసిన ఆరోపణలకు రఘునందన్ రావు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.