RTC Conductor : ఫ్రీ ఆర్టీసీ బస్సులో కండక్టర్ నిర్వాకం.. మహిళకు టికెట్ కొట్టిన వైనం, వీడియో వైరల్
కండక్టర్ తీరుతో బాధిత మహిళలు తీవ్ర ఆవేదన చెందారు. ఉచిత ప్రయాణం గురించి వివరించినా ఆ కండక్టర్ మాత్రం పట్టించుకోలేదని వాపోయారు.
తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితం అని స్వయంగా ప్రభుత్వమే ప్రకటించింది. తెలంగాణ పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఫ్రీగా జర్నీ చేయొచ్చు. ఇందుకోసం ప్రభుత్వం మహాలక్ష్మి పథకం తీసుకొచ్చింది. డిసెంబర్ 9 నుంచి ఈ స్కీమ్ అమల్లోకి వచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఫ్రీ జర్నీకి సంబంధించి ఇప్పటికే ఆర్టీసీ సిబ్బందికి ఆదేశాలు కూడా అందాయి. మహిళల నుంచి టికెట్ ఛార్జీలు వసూలు చేయరాదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అయితే, ఓ ఆర్టీసీ కండక్టర్ ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. మహిళల నుంచి టికెట్ ఛార్జీ వసూలు చేసి వివాదంలో చిక్కుకున్నారు.
నిజామాబాద్ నుంచి బోధన్ వెళ్తున్న బస్సులో మహిళలకు టికెట్ కొట్టారు కండక్టర్. ఉచిత బస్సు సౌకర్యం ఉందని మహిళా ప్రయాణికులు ఎంత చెప్పినా ఆ కండక్టర్ మాత్రం వినిపించుకోలేదు. టికెట్ తీసి మహిళ చేతిలో పెట్టారు. డబ్బు కూడా తీసుకున్నారు. దీంతో మహిళలు అవాక్కయ్యారు.
Also Read : ఒక్క క్రిమినల్ కూడా లేని ముగ్గురు తెలంగాణ మంత్రులు వీరే..
కండక్టర్ తీరుతో బాధిత మహిళలు తీవ్ర ఆవేదన చెందారు. ఉచిత ప్రయాణం గురించి వివరించినా ఆ కండక్టర్ మాత్రం పట్టించుకోలేదని వాపోయారు. బలవంతంగా తమతో టికెట్ ఛార్జీ వసూలు చేశారని అన్నారు. కండక్టర్ వ్యవహారాన్ని వీడియో తీసి ట్విట్టర్ లో షేర్ చేశారు. దాంతో ఆ వీడియో వైరల్ అయ్యింది. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది.
దీంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెంటనే స్పందించారు. ఆ కండక్టర్ పై సీరియస్ అయ్యారు. దీనిపై విచారణకు ఆదేశించారు. ‘సంబంధిత కండక్టర్ ను డిపో స్పేర్ లో ఉంచడం జరిగింది. విచారణ అనంతరం ఆయనపై శాఖపరమైన చర్యలను సంస్థ తీసుకుంటుంది’ అని ట్వీట్ చేశారు సజ్జనార్. ఆ కండక్టర్ పేరు నర్సింహులు అని, బోధన్ డిపోలో పని చేస్తున్నారని తెలిపారు. మహిళల నుంచి టికెట్ ఛార్జీలు వసూలు చేసిన ఉదంతంపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయి ఎంక్వైరీ చేస్తున్నారు.
Also Read : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ఎన్నికల ఫలితాలు చేసిన హెచ్చరిక ఏంటి?
Bodhan Depot. bus conductor forcefully collecting tickets from women passengers. @TelanganaCMO @TelanganaCS @TheNaveena pic.twitter.com/8dPGibqc9p
— Aq ع ق (T.S Freedom Fighter) (@AqueelDanish139) December 10, 2023
A Bus Going From Nizamabad To Bodhan. A Bus Conductor Collected 90Rs Tickets From Women. @RahulGandhi @revanth_anumula@tsrtcmdoffice I Request U Suspend This Conductor.
Where’s #MAHALAKSHMI Scheme ? pic.twitter.com/HRG48v6m1M— Mohammed Akbar Aimim Nzb (@MohdAkb84417010) December 10, 2023
నిజామాబాద్ జిల్లా బోధన్ డిపో పరిధిలో ఒక మహిళకు టికెట్ జారీ చేసిన ఘటనపై విచారణకు ఆదేశించాం. సంబంధిత కండక్టర్ ను డిపో స్పేర్ లో ఉంచడం జరిగింది. విచారణ అనంతరం ఆయనపై శాఖపరమైన చర్యలను సంస్థ తీసుకుంటుంది.
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) December 10, 2023