పెన్నానదిలో కరోనా మృతదేహాలు ఖననం : నెల్లూరు జిల్లాలో దారుణం

  • Published By: nagamani ,Published On : July 10, 2020 / 10:45 AM IST
పెన్నానదిలో కరోనా మృతదేహాలు ఖననం : నెల్లూరు జిల్లాలో దారుణం

Updated On : July 10, 2020 / 12:45 PM IST

కరోనా సోకి చనిపోయిన వారి మృతదేహాలు ఖననం చేసే విషయంలో పలు దారుణాలు జరుగుతున్నాయి. కరోనా మృతదేహాలను గుంతల్లో పడేయటం..పొల్లాల్లో ఊడ్చుకెళ్లటం వంటివి చూశాం. ఇప్పుడు ఏపీలోని నెల్లూరుజిల్లాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. కరోనా మహమ్మారికి గురై చనిపోయినవారి శవాలను ఏకంగా నదిలో ఖననంచేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

జిల్లాలోని పెన్నానదిలో కరోనాతో మృతి చెందినవారిని ఖననం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. జేసీబీలతో పెన్నానదిలో గుంతలు తీసి మృతదేహాలను వైద్య సిబ్బంది పూడ్చివేశారు. మృతదేహాలను పెన్నానదిలో పూడ్చిపెట్టం గురించి తెలిసిన స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Read Here>>దేశంలో తొలిసారి ఒకే రోజులో 25 వేలకు పైగా కరోనా కేసులు