పార్లమెంట్లో గదులు మారిన టీడీపీ, వైసీపీ

పార్లమెంట్లో వైసీపీ పార్లమెంటరీ పార్టీకి నూతన కార్యాలయం కేటాయించింది కేంద్రం. లోక్సభ ఎన్నికల్లో వైసీపీ 22 మంది ఎంపీలను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఎంపీల విజ్ఞప్తి మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా.. గ్రౌండ్ ఫ్లోర్లోని 5వ నెంబర్ గదిని ఆ పార్టీకి కేటాయించారు. అందులో 30 ఏళ్లుగా టీడీపీ కార్యాలయం కొనసాగుతోంది.
అయితే సరైన సంఖ్యలో సభ్యులు లేని కారణంగా ఎన్నికల్లో వైసీపీ 22 మంది ఎంపీలు గెలవడంతో ఆ కార్యాలయాన్ని వారికి కేటాయిస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. మూడో అంతస్తులోని 118 నెంబర్ గదికి టీడీపీ కార్యాలయం తరలించారు. మూడు నెలల కిందటే అయిదో నెంబర్ గది కేటాయించినా ఖాళీ చేయలేదు. దీంతో ఈ వ్యవహారాన్ని పార్టీ నేత విజయసాయిరెడ్డి లేఖ ద్వారా స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. మరోసారి ఓం బిర్లాను కలవడంతో లేఖపై స్పందించారు. ఆయన ఆదేశాలతో పార్లమెంట్ సిబ్బంది.. గ్రౌండ్ ఫ్లోర్లోని 5వ నెంబర్ గదికి టీడీపీ బోర్డును తొలగించి.. వైసీపీ కార్యాలయంగా మార్చారు. ఈ కార్యాలయానికి సమీపంలోనే ప్రధాని మోడీ (10వ నెంబర్ గది), హోం మంత్రి అమిత్ షా కార్యాలయాలు ఉన్నాయి.