Raghunandan Rao : కేసీఆర్ అంటేనే అబద్ధం, మోసం : రఘునందన్ రావు

2016లో దుబ్బాకకు రెవెన్యూ డివిజన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఊరుకో సామెత, నాటకం ఆడుతున్నాడని విమర్శించారు.

Raghunandan Rao : కేసీఆర్ అంటేనే అబద్ధం, మోసం : రఘునందన్ రావు

Raghunandan Rao (2)

Raghunandan Rao – KCR : కేసీఆర్ అంటేనే అబద్ధం, మోసం అని బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. దుబ్బాక దళితులకు దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లతో పోల్చి దుబ్బాకకు ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం ఇస్తారా అని ప్రశ్నించారు. రఘునందన్ రావు గెలిచాక ఏం చేశాడో ప్రజలు చూస్తున్నారని తెలిపారు.

దుబ్బాకు ఏం చేశారని తండ్రి, కొడుకు, అల్లుడు వరుస పెట్టి దుబ్బాక వస్తున్నారని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులన ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన రామలింగారెడ్డి ఉన్నపుడు ఎందుకు అభివృద్ధి చేయలేదని నిలదీశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు.

MLC Kavitha : రైతన్నల నోటి కాడి బువ్వను లాక్కున్నారు, ఇదంతా కాంగ్రెస్ కుట్ర : ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం

2016లో దుబ్బాకకు రెవెన్యూ డివిజన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఊరుకో సామెత, నాటకం ఆడేందుకు ముఖ్యమంత్రికి సిగ్గు ఉండాలన్నారు. కేసీఆర్ అంటేనే అబద్ధం, కేసీఆర్ అంటేనే మోసం అని విమర్శించారు. మీరు చెప్పిన అబద్ధాలు చెప్పాలంటే 5సంవత్సరాలలు పడుతుందన్నారు. తండ్రి, కొడుకు, అల్లుడికి తనపై కోపం ఎందుకని అడిగారు.

దుబ్బాక అభివృద్ధికి నిధులు కావాలనుకోవడం తప్పా అని ప్రశ్నించారు. మీరు చేసిన అరాచకాలకు మీ మీద విరక్తి కలిగి దుబ్బాకలో రఘునందన్ రావు ఎమ్మెల్యే అయ్యాడని పేర్కొన్నారు. నిన్నటి సభలో స్వర్గీయ రామలింగారెడ్డి పేరు తీయడానికి ముఖ్యమంత్రికి మనుసు రాలేదన్నారు. దుబ్బాక ప్రజలపై ఈగ వాలినా తాను ఊరుకోనని హెచ్చరించారు.

Telangana Assembly Election 2023 : తెలంగాణ చివరి అంకంలో అగ్రనేతల ప్రచార హోరు

రామలింగారెడ్డితో హరీష్ గొడ్డు చాకిరి చేయించుకున్నాడని ఆరోపించారు. దుబ్బాక ప్రజల ఆత్మగౌరవం మీద దెబ్బ కోడితే తాను ఊకోనని హెచ్చరించారు. దుబ్బాక ప్రజల గుండెల్లో నిలిచిన తనను తిడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 2009లో 171 ఓట్లతో గెలిచినోడు 1700 ఓట్లతో గెలిచిన తనను ఎక్కిరిస్తున్నాడని తెలిపారు. రింగ్ రోడ్డుకు నెలకే సర్వే చేపిస్తామనడం బాధాకరం అన్నారు.

రింగ్ రోడ్డు సర్వే పూర్తై ఏడాదైందన్నారు. రామలింగారెడ్డి ఉన్నపుడు దుబ్బాక ప్రజలు సమ్మె చేసినప్పుడు ఎందుకు డివిజన్ ఇవ్వలేదని ప్రశ్నించారు. తనది ప్రశ్నించే గొంతు అని అన్నారు. పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టెకు వెతికినప్పుడు తాను పక్కనే ఉన్నానని తెలిపారు. తనను తట్టుకోలేక తనపై భూతులు తిడుతున్నారని పేర్కొన్నారు. దుబ్బాకపై ప్రేమ ఉంటే మెదక్ కంటే ముందు దుబ్బాకకు రింగ్ రోడ్డు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు.

Telangana Assembly Election 2023 : తెలంగాణలో అతి తక్కువ ఓటర్లున్న పోలింగ్ కేంద్రాలివే…

తనను తిడితే బాధపడలేదని వాళ్ల తిట్లే తనకు ఆశీర్వచనం అనుకున్నానని తెలిపారు. ‘కత్తి పోట్లు మేము కూడా చేయవచ్చు’ అనడం ముఖ్యమంత్రికే చెల్లిందన్నారు. ‘మీరు ఎక్కడికి రమ్మంటే వస్తే నన్ను పొడవండి’ అని సవాల్ చేశారు. అసైన్డ్ భూములను గుంజుకుంటున్నారని చెప్పింది అబద్ధమా? దళితుల భూమి గుంజుకొని కలెక్టరేట్ నిర్మించలేదా అని నిలదీశారు.

దుబ్బాక నీది అయితే బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, కేటీఆర్ బడి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఓపెనింగ్ కు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. దుబ్బాకకు వచ్చిన పాలిటెక్నిక్ కళాశాలను హరీష్ రావు ఎత్తుకెళ్లారని ఆరోపించారు. దుబ్బాక వెనుకబడటానికి మొట్టమొదటి కారణం హరీష్ రావేనని విమర్శించారు. చింతమడక గ్రామానికి నరేంద్ర మోదీ ఇచ్చిన డబ్బులు.. కేసీఆర్ ఇచ్చిన డబ్బుల లెక్క తీద్దామని ఛాలెంజ్ చేశారు.