Phanindra Narsetti : సెన్సేషనల్ హిట్ ‘మధురం’ షార్ట్ ఫిలిం గుర్తుందా? వాలెంటైన్ డే రోజు కొత్త సినిమా ప్రకటించిన ఆ డైరెక్టర్..

గతంలో షార్ట్ ఫిలిమ్స్ మొదలైన సమయంలో ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులని మెప్పించాడు ఫణీంద్ర నర్సెట్టి. తను తీసిన 'మధురం' షార్ట్ ఫిలిం అయితే అప్పట్లో ఒక సంచలనం.

Phanindra Narsetti : సెన్సేషనల్ హిట్ ‘మధురం’ షార్ట్ ఫిలిం గుర్తుందా? వాలెంటైన్ డే రోజు కొత్త సినిమా ప్రకటించిన ఆ డైరెక్టర్..

Madhuram Short Film fame Director Phanindra Narsetti coming with new Love Story Movie announced on Valentines Day

Phanindra Narsetti : టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ భారీ సినిమాలతో దూసుకుపోతుంది. త్వరలో పుష్ప 2 సినిమాతో రాబోతుంది. ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థ నుంచి ఓ చిన్న సినిమా రానుంది. అది కూడా లవ్ స్టోరీతో. తాజాగా నేడు వాలెంటైన్ డే సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ తన నెక్స్ట్ సినిమాని ప్రకటించారు. ‘8 వసంతాలు’ అనే ఆసక్తికర టైటిల్ తో సినిమాని ప్రకటించారు.

రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ కూడా ఆసక్తికరంగా ఉంది. పోస్టర్ లో వర్షంలో నేలపై ఓ గులాబిపువ్వుని చూపించారు. పోస్టర్ పై .. ‘365 రోజులని అంకెలతో కొలిస్తే ఒక సంవత్సరం అదే అనుభవాలతో కొలిస్తే, ఒక వసంతం’ అని రాసి ఉంది. అంటే ఈ సినిమా ఓ ప్రేమ జంట మధ్య జరిగే 8 సంవత్సరాల కథ అని తెలుస్తుంది. ఇక ఈ సినిమా డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

గతంలో షార్ట్ ఫిలిమ్స్ మొదలైన సమయంలో ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులని మెప్పించాడు ఫణీంద్ర నర్సెట్టి. తను తీసిన ‘మధురం’ షార్ట్ ఫిలిం అయితే అప్పట్లో ఒక సంచలనం. గంట లెంగ్త్ ఉన్న మధురం సినిమా ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతినిచ్చింది. ఆ సినిమాకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. మధురం సినిమాతో దర్శకుడిగా కూడా అభిమానులను సంపాదించుకున్నాడు ఫణీంద్ర నర్సెట్టి.

Also Read : Samantha : చిన్నప్పుడు అలా చేశాను.. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను.. సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్..

ఆ తర్వాత దర్శకుడిగా ‘మను’ అనే సినిమాని తీశాడు. బ్రహ్మానందం తనయుడు గౌతమ్, చాందిని చౌదరి జంటగా తెరకెక్కిన మను సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వకపోయినా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడు ఫణీంద్ర నర్సెట్టి తనకి బాగా కలిసొచ్చిన లవ్ జానర్ లోనే ఈ 8 వసంతాలు సినిమాతో రాబోతున్నాడు. కచ్చితంగా ఈ సినిమా ప్రేమికులకు కనెక్ట్ అవుతుందని, ప్రేక్షకులని మెప్పిస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమాలో మ్యాడ్ సినిమా ఫేమ్ అనంతిక సునీల్ కుమార్ హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ 8 వసంతాలు సినిమా నుంచి మరింత సమాచారం రానుంది.