India tour of England : భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య 5 టెస్టు మ్యాచుల సిరీస్‌.. షెడ్యూల్ విడుద‌ల చేసిన బీసీసీఐ

వ‌చ్చే ఏడాది జూన్‌లో ఇంగ్లాండ్‌తో జ‌ర‌గ‌నున్న ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ, ఈసీబీలు సంయుక్తంగా ప్ర‌క‌టించాయి.

India tour of England : భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య 5 టెస్టు మ్యాచుల సిరీస్‌.. షెడ్యూల్ విడుద‌ల చేసిన బీసీసీఐ

Indias tour of England 2025 BCCI announces full IND vs ENG schedule

India tour of England 2025 : వ‌చ్చే ఏడాది జూన్‌లో ఇంగ్లాండ్‌తో జ‌ర‌గ‌నున్న ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ), ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) లు సంయుక్తంగా ప్ర‌క‌టించాయి. జూన్ నుంచి ఆగ‌స్ట్ మధ్య ఈ సిరీస్ జ‌ర‌గ‌నుంది. ఈ సిరీస్‌తోనే ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (డ‌బ్ల్యూటీసీ) నాలుగో సైకిల్ ప్రారంభం కానుంది.

ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ‌నే వ్య‌హ‌రించ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇంగ్లాండ్‌, భార‌త జ‌ట్ల మ‌ధ్య ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ 2021లో చివ‌రి సారిగా జ‌రిగింది. అప్పుడు ఓ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగియ‌గా, 2-2తో సిరీస్ స‌మ‌మైంది.

Cristiano Ronaldo : యూట్యూబ్‌లో రొనాల్డో సంచ‌ల‌నం.. 90 నిమిషాల్లోనే మిలియ‌న్‌..

షెడ్యూల్‌ ఇలా..

మొద‌టి టెస్టు : జూన్ 20 నుంచి 24 వ‌ర‌కు లీడ్స్‌లో
రెండో టెస్ట్ : జూలై 2 నుంచి 6 వ‌ర‌కు బర్మింగ్‌హామ్‌లో
మూడో టెస్ట్ : జూలై 10 నుంచి 14 వ‌ర‌కు లార్డ్స్‌లో
నాలుగో టెస్టు : జూలై 23 నుంచి 27 వ‌ర‌కు మాంచెస్టర్‌లో
ఐదో టెస్టు : జూలై 31 నుంచి ఆగస్టు 4 వ‌ర‌కు ఓవల్‌లో

Archana Kamath : పారిస్ ఒలింపిక్స్ స్టార్ అర్చన కామ‌త్ సంచలన నిర్ణయం.. 24 ఏళ్ల‌కే ఆట‌కు వీడ్కోలు.. ఎందుకంటే..?