హైదరాబాద్ లో మరో దారుణం : హిజ్రాపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం

హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ ఆటోడ్రైవర్ హిజ్రాపై అత్యాచారయత్నం చేశాడు. బాచుపల్లిలో ఈ ఘటన జరిగింది. తన ఆటోలో ఎక్కిన

  • Published By: veegamteam ,Published On : December 26, 2019 / 02:34 AM IST
హైదరాబాద్ లో మరో దారుణం : హిజ్రాపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం

హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ ఆటోడ్రైవర్ హిజ్రాపై అత్యాచారయత్నం చేశాడు. బాచుపల్లిలో ఈ ఘటన జరిగింది. తన ఆటోలో ఎక్కిన

హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ ఆటోడ్రైవర్ హిజ్రాపై అత్యాచారయత్నం చేశాడు. బాచుపల్లిలో ఈ ఘటన జరిగింది. తన ఆటోలో ఎక్కిన ట్రాన్స్ జెండర్ పై ఆటో డ్రైవర్ అత్యాచారయత్నం చేశాడు. అతడి నుంచి తప్పించుకున్న హిజ్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత తన తోటి వాళ్లతో కలిసి ఆటోడ్రైవర్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించింది. ఆటోడ్రైవర్ ను మహేష్ గా పోలీసులు గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

కాగా, అమ్మాయిలపై లైంగిక దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట అత్యాచారాలు జరుగుతున్నాయి. దిశ నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత కూడా మృగాళ్లలో మార్పు రావడం లేదు. అమ్మాయిలు, మహిళలనే కాదు వృద్ధులు, పసిపిల్లలను కూడా వదలడం లేదు. దీంతో అమ్మాయిలను బయటికి ఒంటరిగా పంపించాలంటేనే తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఆడపిల్ల భద్రత గురించి వర్రీ అవుతున్నారు. 

3 రోజుల క్రితం మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో దారుణం జరిగింది. బీటెక్ విద్యార్థినిని అసిస్టెంట్ ప్రొఫెసర్ భయపెట్టి సైన్స్ ల్యాబ్‌లోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇది మరువక ముందే హిజ్రాపై ఆటోడ్రైవర్ లైంగిక దాడికి యత్నించడం కలకలం రేపింది.

Also Read : మరో దారుణం : పని ఉందని ల్యాబ్ కు పిలిపించి.. విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారం