వాట్సాప్ వీడియో కాల్ లో నగ్నంగా అమ్మాయి, మాట్లాడితే మూడినట్టే, హైదరాబాద్ లో ఘరానా మోసం

ఆన్ లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఆన్ లైన్ వేదికగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త పద్దతుల్లో

  • Published By: naveen ,Published On : May 19, 2020 / 08:09 AM IST
వాట్సాప్ వీడియో కాల్ లో నగ్నంగా అమ్మాయి, మాట్లాడితే మూడినట్టే, హైదరాబాద్ లో ఘరానా మోసం

ఆన్ లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఆన్ లైన్ వేదికగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త పద్దతుల్లో

ఆన్ లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఆన్ లైన్ వేదికగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త పద్దతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. అడ్డంగా దోచుకుంటున్నారు. ఇప్పటికే అనేక రకాల ఆన్ లైన్ మోసాలు వెలుగుచూశాయి. తాజాగా మరో ఘరానా మోసం బయటపడింది. వాట్సాప్ ద్వారా సైబర్ నేరగాళ్లు డబ్బు దోచుకుంటున్నారు. కొత్త నెంబర్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వస్తుంది. అందులో నగ్నంగా అమ్మాయి దర్శనం ఇస్తుంది. ఆ అమ్మాయి మీతో మాట్లాడుతుంది. అంతే, మీ ఖాతాలో డబ్బు మాయమైనట్టే. ఆ వీడియో ఆధారంగా బ్లాక్ మెయిల్ చేసి దొరికినంత దోచుకుంటారు.

ఇలా మోసం చేస్తారు:
* వాట్సాప్ లో మీకు పరిచయం లేని నెంబర్ నుంచి వీడియో కాల్ వస్తుంది.
* మీరు హలో అనగానే.. అటువైపు నుంచి నగ్నంగా ఉన్న ఒక అమ్మాయి హాయ్ అంటూ పలకరిస్తుంది.
* లాక్ డౌన్ లో నేను ఇలాగే ఉంటున్నా.. మీరూ ఇలాగే ఉంటున్నారా? అంటూ మాటలు కలుపుతుంది. 
* ఇదీ బాధితుల నుంచి రూ.లక్షలు కొట్టేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయోగిస్తున్న తాజా మాయాజాలం. 
* ఆ అమ్మాయితో మీరు చేసిన సంభాషణను రికార్డింగ్ చేసి పలువురి నుంచి డబ్బు గుంజుతున్నారు. 
* ఇలాంటి ఫోన్ కాల్స్ తమకు వచ్చాయంటూ హైదరాబాద్ కు చెందిన 40 మంది సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

లక్ష రూపాయలు ఇచ్చుకున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్:
సికింద్రాబాద్ లో నివాసముంటున్న ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు వారం క్రితం కొత్త నెంబర్ నుంచి వీడియోకాల్ వచ్చింది. అతడు కాల్ లిఫ్ట్ చేశాడు. నగ్నంగా ఉన్న అమ్మాయి దర్శనం ఇచ్చింది. అతడితో మాట్లాడింది. తన పేరు వివరాలు తెలిపింది. ఆ తర్వాత కాల్ కట్ అయ్యింది. కొన్ని గంటల తర్వాత సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఫేస్ బుక్ లో సైబర్ నేరగాళ్లు ఆ వీడియోను అప్ లోడ్ చేశారు. దీంతో అతడికి దిమ్మతిరిగిపోయింది. రూ.5 లక్షలు ఇవ్వకపోతే ఆ వీడియోను కంపెనీ యాజమాన్యానికి పంపుతామని బెదిరించారు. తన పరువు పోతుందని భయపడ్డ బాధితుడు వారితో బేరానికి వచ్చాడు. రూ.1.25 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించాడు. సైబర్ నేరస్థులు సూచించిన ఖాతాలో ఆ మొత్తాన్ని జమ చేశాడు. కాగా, తనలా మరొకరు మోసపోకూడదని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసు పేరుతో బెదిరింపు:
ఇలా సుమారు 40మంది బాధితుల నుంచి ఫిర్యాదులు అందాయి. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. ప్రాథమిక వివరాలు సేకరించారు. ఢిల్లీలో ఉంటున్న నేరస్థులు ముఠాలుగా ఏర్పడి ఇదంతా చేస్తున్నారని గుర్తించారు. అంతేకాదు అమ్మాయితో వీడియో కాల్ చేయించిన తర్వాత ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులమంటూ వారే ఫోన్ చేస్తున్నారు. డబ్బు ఇస్తానంటూ బాధితుడు ఒప్పుకోగానే రూ.లక్షల్లో డిమాండ్ చేస్తారు. తాము అంత ఇవ్వలేమంటూ బాధితులు చెబితే.. బేరం మాట్లాడి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల్లోపు నగదు బదిలీ చేయించుకుంటారు. తర్వాత సిమ్ కార్డులను నాశనం చేస్తున్నారు.

అలాంటి కాల్స్ కు స్పందించకండి, ఈ నెంబర్ కు సమాచారం ఇవ్వండి:
ఈ తరహా వీడియోకాల్ వస్తే స్పందించవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. వల వేసి రూ.లక్షలు కొల్లగొట్టేందుకు నేరస్థులు ఇలా చేస్తున్నారని తెలిపారు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో వీడియోలు ఉంచుతామని హెచ్చరించినా భయపడకుండా గట్టిగా మాట్లాడాలన్నారు. వీడియోకాల్ వచ్చిన వెంటనే సైబర్ క్రైమ్ పోలీసుల నెంబర్ 94906 16555కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Read: యువతి ఫొటోలను నగ్నంగా మార్ఫింగ్ చేసి ప్రొఫెసర్ వేధింపులు