పెళ్లి పేరుతో రెండేళ్లుగా యువతిపై అత్యాచారం

  • Published By: naveen ,Published On : May 7, 2020 / 10:22 AM IST
పెళ్లి పేరుతో రెండేళ్లుగా యువతిపై అత్యాచారం

జార్ఖండ్ రాష్ట్రంలోని లోహర్ దగా జిల్లాలో దారుణం జరిగింది. ఓ నీచుడు పెళ్లి సాకుతో యువతిని మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని ఆ యువతిని నమ్మించిన అతడు రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు పలుమార్లు అబార్షన్లు చేయించాడు. లోహర్‌దగా జిల్లా కురుబ్లాక్‌కు చెందిన ఓ యువతి చదువు నిమిత్తం అమ్మమ్మ ఊరు సెన్హా ఏరియాకు వచ్చి నివాసం ఉంటోంది. ఇదే ప్రాంతలో శివరాజ్‌పూర్‌ గ్రామానికి చెందిన యువకుడు  అజిత్‌ నివాసం ఉంటున్నాడు. చదువు విషయంలో ఇద్దరికీ స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది.

పెళ్లి చేసుకుంటానని అజిత్ ఆ యువతిని నమ్మించాడు. ఆమెను లోబర్చుకున్నాడు. అలా రెండేళ్లుగా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి గర్భం దాల్చడంతో పలుమార్లు అబార్షన్‌ కూడా చేయించాడు. కాగా, ఇటీవల యువతి మరోసారి గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోవాలని అజిత్‌ని పట్టుబట్టింది. పెళ్లికి నిరాకరించిన అజిత్‌.. అక్కడి నుంచి పరారయ్యాడు. తాను మోసపోయానని తెలుసుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.  పరారిలో ఉన్న నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామన్నారు.

Also Read | కూతురిపై కన్నేసిన తండ్రి.. రోజూ పోర్న్ వీడియోలు చూపిస్తూ నరకం చూపించాడు!