Tollywood Meeting : సినిమా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం చివరి సమావేశం.. మెగా మీటింగ్ ఫలించిందా??

గతంలో ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలపై నిర్ణయం తీసుకోవడానికి ఓ కమిటీ వేసింది. ఆ కమిటీ అన్ని రకాలుగా పరిశోధనలు చేసి, చర్చించి ఓ నివేదికని తయారు చేశాయి. తాజాగా ఈ నెల 17న సినిమా........

Tollywood Meeting :  సినిమా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం చివరి సమావేశం.. మెగా మీటింగ్ ఫలించిందా??

Chiranjeevi (6)

Tollywood Meeting :  సినీ పరిశ్రమ కష్టాలు, సినిమా టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వంతో చర్చలు గత కొన్ని నెలలుగా నడుస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ముందుండి పరిష్కారం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. వీటిపై ఏపీ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతున్నారు. తాజాగా నిన్న కూడా చిరంజీవి మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, నిరంజన్ రెడ్డి లతో పాటు మరికొంతమంది ప్రముఖులు వెళ్లి ఏపీ గవర్నమెంట్ తో మాట్లాడారు.

ఈ మీటింగ్ అయిన తర్వాత మీడియా ముందుకు వచ్చి జగన్ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే మంచి విషయం చెప్తారు. త్వరలోనే జీవో కూడా రిలీజ్ చేస్తారు అని తెలిపారు మెగాస్టార్. ఈ మీటింగ్ ఇక చివరిది, దీంతో సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయి అని తెలిపారు. అందరూ కూడా ఇదే భావించారు. అయితే నిన్న జరిగిన మెగా మీటింగ్ సక్సెస్ అయినట్టు తెలుస్తుంది.

Deepika Padukone : ఎన్టీఆర్, అల్లు అర్జున్ పై దీపికా పదుకునే వ్యాఖ్యలు

గతంలో ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలపై నిర్ణయం తీసుకోవడానికి ఓ కమిటీ వేసింది. ఆ కమిటీ అన్ని రకాలుగా పరిశోధనలు చేసి, చర్చించి ఓ నివేదికని తయారు చేశాయి. తాజాగా ఈ నెల 17న సినిమా టిక్కెట్ రేట్ల హేతుబద్ధీకరణ కోసం వేసిన కమిటీతో తుది సమావేశం జరగనుందని తెలిపారు. ఈ కమిటీలోని వారంతా ఒక నివేదికని రెడీ చేసినట్లు, ఆ నివేదికని ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు తెలుస్తుంది. ఈ సమావేశం ఏపీ సెక్రటేరియట్ లో జరగనుంది.

Tollywood : వర్మ vs మెగా.. ఏపీ ప్రభుత్వంతో ఎవరు ఎలా మాట్లాడారు?

ఈ సమావేశం తర్వాత టికెట్ రేట్లపై ఫైనల్ డెసిషన్ ఏపీ ప్రభుత్వం తీసుకోనుంది. మరో వారం రోజుల్లోనే ఈ మీటింగ్ ఉంది. ఈ మీటింగ్ లో మంచి నిర్ణయం వస్తే అందరూ ఆనందిస్తారు. అయితే నిన్నే మెగాస్టార్ తో పాటు మరికొంతమంది టాలీవుడ్ స్టార్స్ జగన్ ని కలవడం, ఇవాళే టికెట్ల ధరల కోసం వేసిన కమిటీ తో మీటింగ్ ఉందని చెప్పడంతో మెగా మీటింగ్ ఫలించిందని అంటున్నారు పరిశ్రమ వర్గాలు.