KA Paul: బిల్‌గేట్స్‌ను చంద్రబాబుకు పరిచయం చేసింది నేనే.. కుటుంబ పాలన పోవాలంటే ప్రజాశాంతి పార్టీ రావాలి: కేఏ పాల్

బిల్ క్లింటన్, బిల్ గేట్స్‌ను నేనే చంద్రబాబుకు పరిచయం చేసానని చదువుకున్న ప్రతి ఒక్కరు చెబుతారు. ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అనేది నా అజెండా. చిన్న దేశాలైన క్యూబా, జింబాబ్వే చేయగలిగినప్పుడు ప్రపంచంలో పెద్ద దేశం అయిన మనం చేయలేమా? ప్రపంచంలో మన దేశంలో ఉన్న వనరులు ఇంకెక్కడైనా ఉన్నాయా? మనదేశంలో ఉన్న తెలివితేటలు ఎక్కడైనా ఉన్నాయా?

KA Paul: బిల్‌గేట్స్‌ను చంద్రబాబుకు పరిచయం చేసింది నేనే.. కుటుంబ పాలన పోవాలంటే ప్రజాశాంతి పార్టీ రావాలి: కేఏ పాల్

KA Paul: బిల్ క్లింటన్, బిల్‌గేట్స్‌ను చంద్రబాబుకు పరిచయం చేసింది తానే అన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. కుల, కుటుంబ పాలన అంతం కావాలంటే ప్రజాశాంతి పార్టీ ఒక్కటే అధికారంలోకి రావాలన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

New Delhi: దారుణం.. నడిరోడ్డు మీద యువతిపై దాడి చేసి, కారులోకి తోసిన యువకుడు.. వైరల్ వీడియో

‘‘బిల్ క్లింటన్, బిల్ గేట్స్‌ను నేనే చంద్రబాబుకు పరిచయం చేసానని చదువుకున్న ప్రతి ఒక్కరు చెబుతారు. ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అనేది నా అజెండా. చిన్న దేశాలైన క్యూబా, జింబాబ్వే చేయగలిగినప్పుడు ప్రపంచంలో పెద్ద దేశం అయిన మనం చేయలేమా? ప్రపంచంలో మన దేశంలో ఉన్న వనరులు ఇంకెక్కడైనా ఉన్నాయా? మనదేశంలో ఉన్న తెలివితేటలు ఎక్కడైనా ఉన్నాయా? ఆదానీకి లక్షల కోట్లు ఎక్కడి నుండి వచ్చాయి? ఇప్పుడున్న ప్రధాని మోదీ మనకు ప్రత్యేక హోదా ఇచ్చారా? ఇలాంటి పాలకులు మనకు కావాలా? జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కేసీఆర్ పార్టీలు మోదీకి బీ పార్టీలు కావా? వీళ్లు అన్ని విధాలా మోదీకి మద్దతు ఇస్తున్నారు. వీళ్లను నమ్మి మనం ఎందుకు మోసపోవాలి?

New Delhi: బ్యాగులో మహిళ పుర్రె, శరీర భాగాలు లభ్యం.. మహిళను హత్య చేసి పడేశారా?

కుల, కుటుంబ పాలనను అంతం చేయాలంటే ప్రజాశాంతి పార్టీ ఒక్కటే రావాలి! ఇదే చివరి అవకాశం. వచ్చే ఎన్నికల వరకు మీడియా యాజమాన్యాలు రోజుకు రెండు గంటలు నాకు కేటాయించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఏకం అవుదాం! కుటుంబ, కుల, అవినీతి పాలనకు చరమగీతం పాడదాం. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు లక్షా 10 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. అందులో కేవలం రూ.42 వేల కోట్లు ఖర్చు చేసి మిగతా రూ.68 వేల కోట్లు మిగుల్చుకున్నారు. మరో 18 నెలల్లో భారత దేశం శ్రీలంక కానున్నది. ఫ్రొఫెసర్ నాగేశ్వర్, జేడీ లక్ష్మీ నారాయణ, జయప్రకాష్ నారాయణలు టీవీలో చాలా అద్భుతంగా కామెంట్‌లు చేస్తున్నారు.

Disney Layoffs: డిస్నీలో ఉద్యోగాల కోత.. ఎవరిని తొలగించాలో గుర్తించాలని మేనేజర్లకు ఆదేశం

వీరి కామెంట్‌ల వల్ల ఏమైనా జరుగుతుందా? మనం అందరం కలిస్తేనే దేశాన్ని రక్షించేది. మోది చేతుల్లో, కాంగ్రెస్ చేతుల్లో దేశం నాశనం అయిపోయింది. కేసీఆర్, చంద్రబాబు, జగన్ చేతుల్లో తెలుగు రాష్ట్రాలు నాశనం అయ్యాయి. ప్రజాశాంతి పార్టీ పోటీ చేయకపోవడం వల్లనే టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకుంది. చంద్రబాబు వల్ల ఏదీ సాధ్యం కాదు. కేఏ పాల్ వస్తేనే అమరావతి కడతారని చాలా మంది అమెరికా నుంచి ఫోన్ చేశారు’’ అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యానించారు.