KL Rahul: అఫీషియల్.. ఐపీఎల్తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్కు కేఎల్ రాహుల్ దూరం
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్, టీమ్ఇండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్(KL Rahul) మిగిలిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్తో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిఫ్ ఫైనల్(WTC Final) మ్యాచ్కు దూరం అయ్యాడు. ఈ విషయన్ని కేఎల్ రాహుల్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
KL Rahul: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్, టీమ్ఇండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్(KL Rahul) మిగిలిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్తో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిఫ్ ఫైనల్(WTC Final) మ్యాచ్కు దూరం అయ్యాడు. ఈ విషయన్ని కేఎల్ రాహుల్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. గాయానికి శస్త్రచికిత్స అవసరం అని, దీని కారణంగా ఐపీఎల్తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్కు తాను అందుబాటులో ఉండడం లేదని ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు.
ఐపీఎల్లో లక్నోకు ఆడుతున్న రాహుల్ ఆర్సీబీతో మ్యాచ్లో బంతిని ఆపే క్రమంలో గాయపడ్డాడు. తొడకండరాలు పట్టేయడంతో విపరీతమైన నొప్పితో మైదానంలో అల్లాడిపోయాడు. ఆఖర్లో బ్యాటింగ్కు వచ్చినా సింగిల్ తీసేందుకు కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో వైద్య బృందంతో సంప్రదింపులు జరిపిన తరువాత శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నట్లు రాహుల్ చెప్పాడు.
View this post on Instagram
రాబోయే కొన్ని వారాలు వేగంగా కోలుకోవడంతో పాటు ఫిట్నెస్ పై దృష్టి పెట్టనున్నట్లు చెప్పాడు. ఈ సమయంలో ఇది కఠినమైన నిర్ణయమే అయినప్పటికీ తప్పడం లేదన్నాడు. జట్టు కెప్టెన్గా ఈ కీలకమైన సమయంలో లక్నో జట్టుతో ఉండకపోవడం చాలా బాధ కలిగిస్తుందన్నాడు. లక్నో ఆటగాళ్లు సందర్భానుసారంగా తమని తాము నిరూపించుకుంటూ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తారని తాను భావిస్తున్నట్లు చెప్పాడు. లక్నో ఆడే మ్యాచులను అందరితో పాటు తాను చూస్తానని అని రాహుల్ అన్నాడు.
WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు భారత్కు వరుస షాక్లు
వచ్చే నెలలో ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియాతో మ్యాచ్కు తాను అందుబాటులో ఉండనని రాహుల్ చెప్పాడు. నీలిరంగు జెర్సీ ధరించి దేశం కోసం ఆడేందుకు తాను చేయగలిగినదంతా చేస్తానని తెలిపాడు. దేశం తరుపున ఆడడమే తన మొదటి ప్రాధాన్యత అని వివరించాడు. ఈ సమయంలో నాకు మద్దతుగా నిలిచిన లక్నో మేనేజ్మెంట్, బీసీసీఐకి అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. గతంలో కంటే మరింత బలంగా, ఫిట్ తిరిగి వస్తాను అని కేఎల్ రాహుల్ వాగ్దానం చేశాడు.
జూన్ 7 నుంచి 11 వరకు ఓవల్లో WTC 2023 ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనుంది.
డబ్ల్యూటీసీ ఫైనల్-2023కి బీసీసీఐ ఎంపిక చేసిన భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, కెఎల్ రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనాద్కట్.
KL Rahul: గేల్ రికార్డును బద్దలు కొట్టిన రాహుల్.. 4వేల క్లబ్లోకి