Errabelli Dayakar : కేసీఆర్- కేటీఆర్ పై చేయి వేస్తే ప్రజలు ఉరికిచ్చి కొడతారు : మంత్రి ఎర్రబెల్లి

రైతుల సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యాయని తాము అనడం లేదన్నారు. కేసీఆర్ రైతు బాంధవుడు అని కొనియాడారు. కేసీఆర్ రైతులకు చేసే అభివృద్ధికి కేంద్రం అడ్డుపడుతోందన్నారు.

Errabelli Dayakar : కేసీఆర్- కేటీఆర్ పై చేయి వేస్తే ప్రజలు ఉరికిచ్చి కొడతారు : మంత్రి ఎర్రబెల్లి

Dayakar

Dayakar Rao criticism of BJP and Congress : బీజేపీ, కాంగ్రెస్ పై మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తీవ్ర  విమర్శలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సిగ్గు లేకుండా మాట్లాడుతోందన్నారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడు కేసీఆర్ పాఠాలను గొప్పగా పొగిడారని గుర్తు చేశారు. రైతులపై కేంద్రం ఎందుకు ఇంత కక్ష సాధిస్తోందని ప్రశ్నించారు.

నకిలీ విత్తనాలను అరికట్టడానికి కేసీఆర్ చట్టం తెచ్చారని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రగల్బాలు చెప్తూ- ఉన్నది లేనట్లు- లేనిది ఉన్నట్లు మాట్లాడుతారని విమర్శించారు. రేవంత్ రెడ్డి గతంలో కాంగ్రేస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపై ధర్నాలు చేసి నోటికి వచ్చిన బూతులు తిట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాలను టీఆరెస్ కేసీఆర్ కడుగుతున్నాడని పేర్కొన్నారు.

Rains : అన్నదాతలను నిండా ముంచిన అకాల వర్షాలు

రైతుల సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యాయని తాము అనడం లేదన్నారు. కేసీఆర్ రైతు బాంధవుడు అని కొనియాడారు. కేసీఆర్ రైతులకు చేసే అభివృద్ధికి కేంద్రం అడ్డుపడుతోందన్నారు. కేంద్రం నుంచి సహాయం ఉంటే రైతులు మరింత లాబపడుతారని చెప్పారు. కరోనా వల్ల రైతులకు కొంత ఇబ్బంది అవుతుందన్నారు.

రైతులకు ఏం చేయని పార్టీలు కూడా మాట్లాడుతున్నాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్- కేటీఆర్ పై చేయి వేస్తే ప్రజలు ఉరికిచ్చి కొడతారని హెచ్చరించారు. కేసీఆర్ ను కొట్టే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. ‘మేము ఏం చేశామో- మీరు ఏం చేశారో బయటపెట్టండి’ మేము బహిరంగ చర్చకు సిద్ధం అని సవాల్ విసిరారు.