Modi : కొత్త పార్లమెంటు భవన నిర్మాణ ప్రదేశాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం ఢిల్లీలోని కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ ప్రదేశాన్ని ఆకస్మికంగా సందర్శించారు. నిర్మాణ పనులను స్వయంగా తనిఖీ చేశారు. రూ.971 కోట్ల అంచనా వ్యయ

Modi : కొత్త పార్లమెంటు భవన నిర్మాణ ప్రదేశాన్ని సందర్శించిన ప్రధాని  మోదీ

Pm Modi

PM Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం ఢిల్లీలోని కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ ప్రదేశాన్ని ఆకస్మికంగా సందర్శించారు. నిర్మాణ పనులను స్వయంగా తనిఖీ చేశారు. రూ.971 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించబడుతున్న భవన నిర్మాణ స్థితిని ప్రధాని మోదీ ప్రత్యక్షంగా చూశారు. ఈ భవన నిర్మాణం 2022 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. నిర్మాణ ప్రదేశంలో సుమారు గంట పాటు గడిపారు మోదీ. నిర్మాణ పనుల్లో పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

modi

కొత్త పార్లమెంటు భవనం సైట్‌ ను మోదీ సందర్శించడం ఇదే మొదటిసారి. కరోనా మహమ్మారి సంక్షోభం సమయంలో ఇలాంటి నిర్మాణాలు అవసరమా? అని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. కొత్త పార్లమెంటు భవన నిర్మాణాన్ని ఆపేసి ఆ నిధులతో కోవిడ్ -19 మహమ్మారి నిర్వహణ కోసం ఖర్చు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

modi

గత ఏడాది డిసెంబర్‌లో కొత్త పార్లమెంటుకు పునాది రాయి వేస్తూ, కొత్త భవనం 21 వ శతాబ్దపు దేశ ఆకాంక్షలను నెరవేరుస్తుందని, అదే విధంగా “కొత్త , పాత సహజీవనం” కు ప్రతీక అని ప్రధాని మోదీ అన్నారు. ప్రస్తుతం ఉన్న భవనం ఇప్పుడు పదవీ విరమణ చేయాలని చూస్తోంది. 21 వ శతాబ్దపు భారతదేశానికి కొత్త పార్లమెంటు భవనాన్ని ఇవ్వడం మనందరి బాధ్యత” అని మోదీ అన్నారు.

Rakul Preet Singh: షాకింగ్.. రకుల్ పెదవులకు సర్జరీ?

ప్రధాన సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కొత్త పార్లమెంట్ హౌస్, కార్యాలయాలు, ప్రధాన మంత్రి, ఉపరాష్ట్రపతికి కొత్త నివాస సముదాయాన్ని నిర్మించాలని భావిస్తుంది. ఇది కొత్త కార్యాలయ భవనాలు, వివిధ మంత్రిత్వ శాఖల కార్యాలయాలకు అనుగుణంగా కేంద్ర సెక్రటేరియట్ కూడా ఉంటుంది.

కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటివరకు రూ.238 కోట్లు, సెంటర్ విస్టా అవెన్యూ పునర్నిర్మాణానికి రూ. 63 కోట్లు ఖర్చు చేసింది. ప్రభుత్వం ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఈ రెండు ప్రాజెక్టులకు అయ్యే అంచనా వ్యయాలు రూ. 1,289 కోట్లు.

Milk Dairy: సాఫ్ట్‌వేర్ వదిలి పాలడైయిరీతో సక్సెస్

10 కొత్త సెక్రటేరియట్ భవనాల నిర్మాణం సహా కొనసాగుతున్న సెంట్రల్ విస్టా పునరాభివృద్ధి ప్రాజెక్ట్ ప్రభుత్వ కార్యాలయాల అద్దె రూపంలో ప్రభుత్వానికి రూ.వెయ్యి కోట్ల ఆదాకు దారితీస్తుందని గతంలో చెప్పింది. మహాత్మా గాంధీ, అంబేద్కర్ సహా ఐదుగురి విగ్రహాలను ప్రస్తుతం పార్లమెంటు కాంప్లెక్స్ నుంచి తీసుకొచ్చి కొత్త పార్లమెంటు భవనంలో ఉంచనున్నారు.