PM Modi : శ్రీరామానుజ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.. జాతికి అంకితం

రూపొందిన 216 అడుగుల భగవద్రామానుజాచార్యుల మహా విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించి, జాతికి అంకింతం చేశారు. ముచ్చింతల్ ఆశ్రమానికి చేరుకున్న మోదీ... అనంతరం యాగశాలకు చేరుకున్నారు.

PM Modi : శ్రీరామానుజ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.. జాతికి అంకితం

Ramanuja (1)

Sri Ramanuja statue unveiled : రంగారెడ్డి జిల్లా ముచ్చింత్ లో సమతామూర్తి శ్రీమానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. 216 అడుగుల శ్రీరామానుజ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. సమతామూర్తి విగ్రహాన్ని లోకార్పణం చేశారు. శ్రీరామానుజార్యుల విగ్రహానికి మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. విష్వక్సేన ఇష్టి పూర్ణాహుతి కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. యాగాశాలలో ప్రధాని మోదీకి చిన్నజీయర్ స్వామి కంకణం కట్టారు. విష్వక్సేనుడికి హారతి ఇచ్చారు. 108 దివ్యదేశ క్షేత్రాలను సందర్శించారు.

ప్రధాని మోదీ ప్రత్యేక హెలికాప్టర్ లో ముచ్చింతల్ చేరుకున్నాడు. రామానుజాచార్యుల సహస్రాబ్ధి ఉత్సవాల్లో పీఎం పాల్గొన్నారు. యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. విశ్వానికి మానవతా సందేశాన్ని అందించిన మహనీయులైన శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామి సత్య సంకల్పంతో.. దివ్య సాకేతంలో

PM Modi : ముచ్చింతల్ చేరుకున్న ప్రధాని మోదీ

రూపొందిన 216 అడుగుల భగవద్రామానుజాచార్యుల మహా విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించి, జాతికి అంకింతం చేశారు.
ముచ్చింతల్ ఆశ్రమానికి చేరుకున్న మోదీ… అనంతరం యాగశాలకు చేరుకున్నారు. అక్కడ విశ్వక్సేన ఇష్టి పూర్ణాహుతిలో పాల్గొన్నారు. మన అభీష్టాలను నెరవేర్చేందుకు కోసం విశ్వక్సేన ఇష్టి నిర్వహించారు.. ప్రధాని చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలన్న సంకల్పంతో ఈ విశ్వక్సేన ఇష్టిని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామిజీ నిర్వహించారు.

విశ్వక్సేన ఇష్ఠి అనంతరం సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు భగవత్‌ రామానుజాచార్య సమతామూర్తి విగ్రహం చుట్టూ నిర్మించిన 108 దివ్యదేశ క్షేత్రాలను సందర్శించనున్నారు. ఆ తర్వాత రామానుజాచార్య స్వర్ణ విగ్రహాన్ని దర్శించుకుని సమతామూర్తి విగ్రహం వద్దకు చేరుకున్నారు. సమతామూర్తి లేజర్‌ షోను తిలకించి విగ్రహాన్ని లోకార్పణం చేయనున్నారు. అక్కడే భగవత్‌రామానుజాచార్యుల మహావిగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసంగించారు.

PM Modi : వ్యవసాయాన్ని అందరికీ ఉపయోగకరంగా చేయడంలో ఇక్రిశాట్ సక్సెస్ : ప్రధాని మోదీ

అంతకముందు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు పీఎం మోదీ హాజరయ్యారు. ఇక్రిశాట్ కొత్త లోగో, స్టాంప్ ను పీఎం ఆవిష్కరించారు. రాపిడ్ జనరేషన్ అడ్వాన్స్ మెంట్ ఫెసిలిటీని ప్రారంభించారు. ఇక్రిశాట్ లో వివిధ పరిశోధనల కేంద్రాలను ప్రారంభించారు. ఇక్రిశాట్ లో కొత్త వంగడాలను పరిశీలించారు. ఇక్రిశాట్ లో ఫొటో గ్యాలరీలు, స్టాళ్లను పరిశీలించారు. ఫొటో ఎగ్జిబిషన్ సందర్శించారు.

సహస్రాబ్ది ఉత్సవాల్లో 1035 హోమగుండాల్లో దివ్యంగా జరుగుతున్న శ్రీలక్ష్మీనారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతికి మోదీ హాజరయ్యారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత 5 వేల మంది రుత్విజులు మోదీకి ఆశీర్వచనాలు అందిస్తారు. 8 గంటలకు భవ్యధామంలో ప్రధాని మోదీ పర్యటన ముగుస్తుంది. అనంతరం శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకుని ఢిల్లీ బయల్దేరతారు.