Record prices : దేశీయ మిర్చి రూ.55,551, పత్తి రూ.12,110.. ఆనందంలో అన్నదాతలు

రైతులు ఎర్రబంగారంగా పిలుచుకొనే మిర్చి ధరలు దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా దేశీయ మిర్చి రకం బంగారంతో సమానంగా పోటీ పడుతుంది.

Record prices : దేశీయ మిర్చి రూ.55,551, పత్తి రూ.12,110.. ఆనందంలో అన్నదాతలు

Record Prices

Record prices : రైతులు ఎర్రబంగారంగా పిలుచుకొనే మిర్చి ధరలు దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా దేశీయ మిర్చి రకం బంగారంతో సమానంగా పోటీ పడుతుంది. సాధారణంగా ప్రతి యేడాది క్వింటా దేశీయ మిర్చి రూ. 25 వేల నుంచి రూ. 28 వేలకు పరిమితమవుతుంది. కానీ ఈ ఏడాది ఆరంభం నుంచి దేశీయ మిర్చి రకం ధర పెరుగుతూ వస్తుంది. గత నెల 3న తొలిసారి క్వింటాల్ దేశీయ మిర్చిధర రూ. 32వేలు పలుకగా.. అప్పటి నుంచి పెరుగుకుంటూ వస్తోంది. సోమవారం వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్ లో కిషన్ రావు అనే రైతు తెచ్చిన దేశీయ మిర్చి రికార్డు స్థాయిలో రూ. 55,551 పలికింది. మిర్చికి అధిక ధర నమోదు కావడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Cotton : రైతుకు మేలు చేసే… అధిక సాంద్రత పద్ధతిలో పత్తిసాగు

మరోవైపు తెల్ల బంగారంగా పిలుచుకొనే పత్తి ధరలు అమాంతం పెరుగుతూ పోతున్నాయి. గతేడాది పత్తి క్వింటా రూ. 7, 500 వరకు పలికింది. ఈ ఏడాది ప్రారంభంలోనే రూ. 8వేల పలికింది. క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం పత్తి క్వింటా రూ. 12,110 చేరింది. పత్తికి, మిర్చికి గతంలో ఇలాంటి ధరలు ఎప్పుడూ చూడలేదని మార్కెట్ వ్యాపారులు, రైతులు పేర్కొంటున్నారు.

Mirchi ice cream : ప‌చ్చి మిర్చీతో ఐస్‌క్రీమ్‌..!ఏం వంటకాల్రా బాబూ…ఎలా వస్తాయిరా నాయినా ఇలాంటి ఐడియాలు..!!

అయితే ఈ ఏడాది మిర్చి, పత్తి పంటల దిగుబడులు తక్కువగా ఉండటంతో ధరలు అమాంతం పెరిగినట్లు రైతులు పేర్కొంటున్నారు. మిర్చికి తెగళ్లు సోకి పంట దెబ్బతినగా, వర్షాల కారణంగా పత్తి పంటల దెబ్బతింది. ఈ క్రమంలో ఆశించిన స్థాయిలో దిగుబడులు లేకపోవటంతో మిర్చి, పత్తి కి రికార్డు ధరలు పలుకుతున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.