Rajasthan: కాంగ్రెస్ గుర్తులేమీ లేకుండా సొంత ప్రభుత్వం మీదే నిరహార దీక్ష చేపట్టిన సచిన్ పైలట్

రాజస్థాన్ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కంటే కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ వివాదమే ఎక్కువగా చర్చలోకి వస్తుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య చాలా కాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది

Rajasthan: కాంగ్రెస్ గుర్తులేమీ లేకుండా సొంత ప్రభుత్వం మీదే నిరహార దీక్ష చేపట్టిన సచిన్ పైలట్

Sachin Pilot protest

Rajasthan: రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు కాంగ్రెస్ పార్టీ నేత సచిన్ పైలట్. సొంత ప్రభుత్వంపై నిరసన చేపట్టిన పైలట్.. నిరహార దీక్ష స్థలంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎలాంటి గుర్తులు లేకుండా జాగ్రత్తపడ్డారు. తన మద్దతుదారులతో కలిసి రాజస్థాన్ రాజధాని జైపూర్‭లోని షహీద్ స్మారక్ స్థల్ వద్ద ఈ నిరాహార దీక్ష చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే అవినీతిపై గెహ్లాట్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, ఈ విషయమై ఏడాదిన్నర క్రితం తాను ముఖ్యమంత్రికి లేఖ రాసినప్పటికీ అటు నుంచి ఎలాంటి స్పందన రాలేదని పైలట్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Andhra Pradesh : ఎండవేడికి పగిలిన కొండరాయి .. మీదపడుతుందోనని ఊరొదిలిపోతున్న జనాలు

నిరాహార దీక్ష స్థలం నుంచి సచిన్ పైలట్ మాట్లాడుతూ ‘‘వసుంధర రాజే ప్రభుత్వంలో జరిగిన అవినీతి మీద ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. 45 వేల కోట్ల రూపాయల మైనింగ్ స్కాం మీద అధికారంలోకి రాగానే విచారణ చేస్తామని మేం విపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చాము. కానీ ప్రభుత్వం పూర్తి చేసుకోవస్తోంది. అయినప్పటికీ ఎలాంటి చర్యలు ప్రారంభం కాలేదు’’ అని మండిపడ్డారు.

AAP National Party: 10 ఏళ్లలో జాతీయ పార్టీగా ఎదిగిన ఆప్.. దేశంలో తొమ్మిదవ జాతీయ పార్టీగా రికార్డ్

అయితే పైలట్ చేపట్టిన ఈ దీక్షపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కింద భావిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సుఖ్వీందర్ సింగ్ రాంధావా మండిపడ్డారు. సొంత ప్రభుత్వంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే, వచ్చి చర్చించాలని, కానీ ఇలా మీడియా ముందుకు ప్రజల ముందుకు వెళ్లి పార్టీని తక్కువ చేయడం సరికాదని ఆయన అన్నారు. ‘‘నేను ఐదేళ్ల నుంచి ఏఐసీసీ సభ్యుడిగా, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీగా ఉన్నాను. కానీ పైలట్ ఎప్పుడూ ఈ విషయాలను నా దృష్టికి తీసుకురాలేదు. నేను ఇప్పటికైనా చెప్తున్నాను. సామరస్యపూర్వకంగా చర్చించుకుంటే పోతుంది. ఇప్పటికైనా నిరసన విరమించండి’’ అని రాంధావా అన్నారు.

Gurukula jobs : తెలంగాణాలో గురుకుల ఉద్యోగాల భర్తీకి ఈనెల 12 నుండి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం

రాజస్థాన్ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కంటే కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ వివాదమే ఎక్కువగా చర్చలోకి వస్తుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య చాలా కాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ జ్వాలలు అప్పుడప్పుడు బయటికి కూడా వస్తూనే ఉంటాయి. ఈ కారణంగానే గెహ్లాట్ ప్రభుత్వంపై పైలట్ తిరుగుబాటు చేయడం, ఆ తర్వాత ప్రభుత్వం నుంచి తప్పుకోవడం వంటివి జరిగిపోయాయి. అయితే ఇంత జరిగినా ఇద్దరి మధ్య యుద్ధం తగ్గకపోగా, నానాటికీ పెరుగుతూనే ఉంది.

Karnataka Elections 2023 : రైతు కొడుకులను వివాహం చేసుకునే యువతులకు రూ.2 లక్షలు కానుక : కుమారస్వామి

అవకాశం దొరికినప్పుడు ఇరు నేతలు ఏదో ఒక కాంట్రవర్సీకి తెరలేపుతూనే ఉన్నారు. ఇతర పార్టీల నేతలపై చేసే వ్యాఖ్యలు కూడా ఒకరినొకరు టార్గెట్ చేసుకున్నట్లే కనిపిస్తుంటాయి. తాజాగా బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే అవినీతి అంశాన్ని పైలట్ లేవనెత్తారు. వాస్తవానికి ఆయన రాజే అవినీతిని పైకి లేపినప్పటికీ సీఎం గెహ్లాట్‭నే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఇతర పార్టీల అవినీతిపై ఆరోపణలు చేయడం రాజకీయాల్లో సహజమే అయినప్పటికీ.. సొంత పార్టీ ప్రభుత్వం దానిపై చర్యలు తీసుకోవడం లేదని పైలట్ వ్యాఖ్యానించడం గమనార్హం.