Karnataka: ఉచిత బస్సు ప్రయాణం 20 కిలోమీటర్లేనట.. ముహూర్తం ముందు అసలు విషయం చెప్పిన కర్ణాటక సర్కార్

ఈ పథకం కింద రాష్ట్రమంతా ప్రయాణించే వీలు ఉండదు. కేవలం 20 కిలోమీటర్ల పరిమితి మేరకే ప్రయాణించాల్సి ఉంటుంది. అనంతరం సాగే ప్రయాణానికి డబ్బులు చెల్లించాల్సిందేనట. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం స్వయంగా వెల్లడించారు.

Karnataka: ఉచిత బస్సు ప్రయాణం 20 కిలోమీటర్లేనట.. ముహూర్తం ముందు అసలు విషయం చెప్పిన కర్ణాటక సర్కార్

Free Bus Travel: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు ప్రధాన హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (శక్తి యోజన) జూన్ 11వ తేదీన ప్రారంభం కానుంది. ఈ పథకం అన్ని కులాలు, మతాలు, తరగతులకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులందరికీ చేరేలా చూడాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం మంత్రులు శాసనసభ్యులను ఆదేశాలు జారీ చేశారు.

Telangana Congress : మల్లు రవితో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల భేటీ … కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారా?

ఆదివారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి ప్రారంభించనున్న ఈ పథకంలోని అసలు విషయాన్ని తాజాగా వెల్లడించారు. వాస్తవానికి ఈ పథకం కింద రాష్ట్రమంతా ప్రయాణించే వీలు ఉండదు. కేవలం 20 కిలోమీటర్ల పరిమితి మేరకే ప్రయాణించాల్సి ఉంటుంది. అనంతరం సాగే ప్రయాణానికి డబ్బులు చెల్లించాల్సిందేనట. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం స్వయంగా వెల్లడించారు.

NCP Working Presidents: సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్‭లను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించిన శరద్ పవార్

ఈ విషయమై సిద్ధరామయ్య మాట్లాడుతూ ‘‘ఐదు గ్యారంటీ హామీల్లో ఒకటైన ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించబోతున్నాం. అయితే ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏసీ బస్సులు, వోల్వోల్లో ఈ ప్రయాణ సౌకర్యం ఉండదు అలాగే 20 కిలోమీటర్ల పరిమితి వరకు మాత్రమే ఉచిత ప్రయాణం ఉంటుంది. ఉదహారణకు తిరుపతి వెళ్లనుకునే వారు బుల్బాఘల్ నుంచి ఆంధ్రప్రదేశ్ బార్డర్ (కోలార్ సరిహద్దు) వరకు మాత్రమే ఉచిత ప్రయాణం లభిస్తుంది. ఆ తర్వాత ప్రయాణానికి డబ్బులు చెల్లించాలి’’ అని అన్నారు.

Kerala to Mecca: 8,600 కి.మీ, 370 రోజులు, 6 దేశాలు.. కేరళ నుంచి మక్కాకు కాలినడకన సాగిన ఓ వ్యక్తి అద్భుతమైన ప్రయాణం

ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రచారం.. ఉచిత బస్సు పథకం కర్ణాటకలో 50 శాతం జనాభాకు ఉపయోగపడుతుంది. ఈ పథకంలోకి ట్రాన్స్‌జెండర్లను కూడా తీసుకోనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. BMTC, KSRTC, KKRTC, NWKRTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. ఈ పథకం కింద BMTC మినహా మిగిలిన మూడు రవాణా కార్పొరేషన్లలో పురుషులకు 50 శాతం సీట్లు రిజర్వ్ చేశారు.

Umar Khalid: జేఎన్‭యూ విద్యార్థి ఉమర్ ఖలీద్ జైలుకు వెళ్లి 1,000 రోజులు పూర్తి

అదనంగా జీరో టికెట్/శక్తి స్మార్ట్ కార్డ్ డేటా ఆధారంగా రవాణా ఏజెన్సీలు చేసే ఖర్చును ప్రభుత్వం భరించనుంది. ఇక మహిళా ప్రయాణికులు ప్రయాణించే దూరం ఆధారంగా రోడ్డు రవాణా సంస్థకు రీయింబర్స్‌మెంట్ అవుతుంది. అయితే ఈ పథకం ఏసీ, లగ్జరీ బస్సులకు వర్తించదని ప్రభుత్వం పేర్కొంది. అలాగే కర్ణాటక పరిధిలో మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాలకు వెళ్లే కర్ణాటక బస్సుల్లో కానీ, కర్ణాటకలోకి వచ్చే ఇతర రాష్ట్రాల బస్సుల్లో కానీ అనుమతి ఉండదు.