Delhi Firing Two killed : ఢిల్లీలో అర్ధరాత్రి దుండగుల కాల్పులు..ఇద్దరు మృతి
దేశ రాజధాని ఢిల్లీలో అర్ధరాత్రి కాల్పుల కలకలం రేగింది. జేజే కాలనీలో తుపాకుల మోత మోగింది. గుర్తుతెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ముఖానికి మాస్కులతో వచ్చిన ఇద్దరు వ్యక్తులు... ఓ ఇంట్లోకి చొరబడ్డారు.
Delhi Firing Two killed : దేశ రాజధాని ఢిల్లీలో అర్ధరాత్రి కాల్పుల కలకలం రేగింది. జేజే కాలనీలో తుపాకుల మోత మోగింది. గుర్తుతెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ముఖానికి మాస్కులతో వచ్చిన ఇద్దరు వ్యక్తులు… ఓ ఇంట్లోకి చొరబడ్డారు.
ఆ ఇంట్లో టీవీ చూస్తున్న ముగ్గురు వ్యక్తులపై కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు… దర్యాప్తు ప్రారంభించారు.
Viral video: బిహార్లో దారుణ ఘటన.. 9వ తరగతి బాలిక మెడపై యువకుడి కాల్పులు.. సీసీ కెమెరాలో రికార్డు
నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఎందుకు కాల్పులు జరిపారన్నదానిపై ఆరా తీస్తున్నారు. అయితే బాధితులకు ఎవరితోను ఎలాంటి గొడవలు లేవని స్థానికులు చెబుతున్నారు.