Rahul Gandhi : కాంగ్రెస్‌కు నష్టమని తెలిసినా.. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు- రాహుల్ గాంధీ

లక్ష కోట్లు దోపిడీ చేసిన కేసీఆర్ పై ఎలాంటి విచారణ లేదు. సీబీఐ, ఈడీ కేసులు లేవు. ఢిల్లీలో బీజేపీని, రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ఓడించాలి. Rahul Gandhi

Rahul Gandhi : కాంగ్రెస్‌కు నష్టమని తెలిసినా.. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు- రాహుల్ గాంధీ

Rahul Gandhi Slams KCR (Photo : Twitter)

Rahul Gandhi Slams KCR : తెలంగాణతో నాకున్నది రాజకీయ అనుబంధం కాదు కుటుంబ అనుబంధం అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. నెహ్రూ, ఇందిరమ్మ నుంచి ఈ బంధం కొనసాగుతోందని చెప్పారు. రాజకీయంగా కాంగ్రెస్ కు నష్టమని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని రాహుల్ గాంధీ వివరించారు.

ప్రత్యేక రాష్ట్రం వచ్చి పదేళ్లు అవుతున్నా.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదని రాహుల్ గాంధీ వాపోయారు. ఇప్పుడు జరిగే ఎన్నికలను.. దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు. కేసీఆర్ తనకు తాను తెలంగాణకు రాజుగా భావిస్తున్నారని మండిపడ్డారు రాహుల్ గాంధీ. పెద్దపల్లిలో కాంగ్రెస్ విజయభేరి యాత్రలో రాహుల్ గాంధీ మాట్లాడారు.

మోదీ, కేసీఆర్.. ఇద్దరూ ప్రజలను మోసం చేశారు..
”బీఆర్ఎస్ పాలనలో పేదల భూములు గుంజుకున్నారు. ధరణి పేరుతో మీ భూములను కేసీఆర్ లాక్కున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని కేసీఆర్ ప్రజలను మోసం చేశారు. కేసీఆర్ పాలనలో బడా కాంట్రాక్టర్లకు లాభం జరిగింది తప్ప పేదలకు ఒరిగిందేమీ లేదు. సింగరేణి మైన్స్ ప్రైవేటుపరం చేస్తున్నారు. గతంలో సింగరేణి మైన్స్ ను కేసీఆర్ అదానీకి అమ్మాలని చూశారు. దేశ సంపదను ప్రధాని మోదీ అదానీకి దోచిపెడుతున్నారు. మోదీ, కేసీఆర్ ఇద్దరూ ప్రజలను మోసం చేశారు.

Also Read : కాంగ్రెస్ ఫస్ట్ లిస్టులో రేవంత్ మనుషులకే ఎక్కువ టికెట్లు దక్కాయా?

అధికారంలోకి రాగానే ఒక్కొక్కరికి రూ.15వేలు..
కాంగ్రెస్ మాట ఇచ్చిందంటే నిలబెట్టుకుంది. రాజస్థాన్, ఛత్తీస్ గడ్, కర్ణాటకలో ఇచ్చిన హామీలను అమలు చేశాం. తెలంగాణలోనూ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరతాం. మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు రూ.2500 అందిస్తాం. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. భూమి లేని రైతు కూలీలకు 12వేలు.. రైతులకు, కౌలు రైతులకు 15వేలు అందిస్తాం. గృహలక్ష్మి ద్వారా ప్రతీ ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరు గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే అమలు చేస్తాం. కేసీఆర్ ప్రభుత్వం పోయి ప్రజా ప్రభుత్వం రాబోతోంది.

లక్ష కోట్లు దోపిడీ చేసిన కేసీఆర్ పై ఎందుకు విచారణ లేదు?
బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి కాంగ్రెస్ ను ఓడించాలని చూస్తున్నాయి. బీజేపీ, ఎంఐఎంకు ఓటు వేస్తే బీఆర్ఎస్ కు వేసినట్టే. బీజేపీపై పోరాడినందుకు నాపై కేసులు పెట్టారు. నా లోక్ సభ సభ్యత్వం రద్దు చేశారు. కానీ లక్ష కోట్లు దోపిడీ చేసిన కేసీఆర్ పై ఎలాంటి విచారణ లేదు. సీబీఐ, ఈడీ కేసులు లేవు. ఢిల్లీలో బీజేపీని, రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ఓడించాలి. తెలంగాణలో కాంగ్రెస్ సునామీ రాబోతోంది. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. దేశంలో కులగణన చేపట్టాలి. అది దేశానికి ఎక్స్ రే లాంటిది. ఓబీసీ గురించి మాట్లాడే ప్రధాని ఎందుకు కులగణన చేపట్టడం లేదు?” అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

Also Read : కేసీఆర్ రాకతో షబ్బీర్ అలీ వెనకడుగు.. కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి ఆయనేనా?