PM MODI: వైఎస్.షర్మిలకు ప్రధాని మోదీ ఫోన్.. అరెస్టు వ్యవహారంపై ఆరా

వైఎస్ షర్మిలకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఇటీవల షర్మిలను తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రధాని ఆరా తీశారు. షర్మిలకు సానుభూతి తెలిపారు.

PM MODI: వైఎస్.షర్మిలకు ప్రధాని మోదీ ఫోన్.. అరెస్టు వ్యవహారంపై ఆరా

PM MODI: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఇటీవల షర్మిల అరెస్టు నేపథ్యంలో ఆమెకు మోదీ సానుభూతి తెలిపారు. అరెస్టు వ్యవహారంలో దాదాపు పది నిమిషాలు మోదీ, షర్మిలతో మాట్లాడినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంగళవారం అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న షర్మిల బెంగళూరు బయల్దేరి వెళ్లారు.

Elon Musk: ఎలన్ మస్క్‌కు ఎదురుదెబ్బ.. న్యూరాలింక్ సంస్థపై అమెరికా విచారణ.. కారణమేంటి?

ఇటీవల వైఎస్.షర్మిలను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు రోజు ఆమె పాదయాత్రను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో దీనికి నిరసనగా మరుసటి రోజు ప్రగతి భవన్ వద్ద దీక్ష చేపట్టేందుకు షర్మిల కారులో బయల్దేరి వెళ్లారు. ఈ క్రమంలో ఆమె కారును పోలీసులు అడ్డుకున్నారు. క్రేన్ ద్వారా కారుతోసహా షర్మిలను అదుపులోకి తీసుకెళ్లారు. ఆమెను ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో ఉంచి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తర్వాత నాంపల్లి కోర్టులో హాజరపర్చగా, కోర్టు షర్మిలకు బెయిల్ మంజూరు చేసింది. ఈ విషయంలో టీఆర్ఎస్, షర్మిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.