Revanth Reddy: పాన్ పరాక్ మానేస్తే బాగుంటుంది: మంత్రి తలసానికి రేవంత్ రెడ్డి చురకలు 

Revanth Reddy: "నేను టీపీసీసీ అధ్యక్షుడిని. తలసాని జీవితాంతం కేసీఆర్ కాళ్లు పిసికినా నా స్థాయికి రాలేరు" అని చురకలు అంటించారు.

Revanth Reddy: పాన్ పరాక్ మానేస్తే బాగుంటుంది: మంత్రి తలసానికి రేవంత్ రెడ్డి చురకలు 

Revanth Reddy

Revanth Reddy: తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనపై చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇవాళ రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ… “పేడ పిసికే అలవాటున్న తలసానికి పిసుకుడు గురించే మాట్లాడుతారు. పిసుకుడు సంగతి దేవుడెరుగు.. అతను నమిలే పాన్ పరాక్ మానేస్తే బాగుంటుంది” అని అన్నారు.

“అరటిపళ్ల బండిదగ్గర మేక నమిలినట్లు పాన్ పరాక్ లు నమిలే వారు కూడా నా గురించి మాట్లాడితే అంత గౌరవంగా ఉండదు. ఆయనకు అంతగా కోరిక ఉంటే.. ఏం పిసకాలనుకుంటున్నారో, ఎక్కడకు రావాలో తారీఖు చెబితే వస్తా.. ఎవరేం పిసుకుతారో చూద్దాం.

కేసీఆర్ కాళ్లు పిసకడం అనుకుంటున్నాడా? రేవంత్ రెడ్డిని పిసకడం అంటే. మంత్రిగా మాట్లాడేటప్పుడు బాధ్యతగా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. నేను టీపీసీసీ అధ్యక్షుడిని. తలసాని జీవితాంతం కేసీఆర్ కాళ్లు పిసికినా నా స్థాయికి రాలేరు” అని చురకలు అంటించారు.

వర్షాకాలం.. కంటోన్మెంట్‌ను పట్టించుకోండి..
వర్షాకాలంలో కంటోన్మెంట్ పరిధిలో ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులపై బోర్డు సమావేశంలో చర్చించామని రేవంత్ రెడ్డి అన్నారు. రోడ్లు, నాళాలు, సీవరేజ్ ప్లాంట్ ఏర్పాటు అంశాలపై కూడా సమావేశంలో చర్చించామని వివరించారు. “మాజీ ఎంపీ నంది ఎల్లయ్యతో పాటు మాజీ ఎమ్మెల్యే సాయన్న విగ్రహాలను కంటోన్మెంట్ పరిధిలో ఏర్పాటు చేయాలని సమావేశంలో చర్చించాం.

ఇందుకు సరైన స్థలాన్ని బోర్డు పరిశీలిస్తామని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కంటోన్మెంట్ కు రావాల్సిన నిధులు సరైన సమయంలో విడుదల చేయడంలేదు. దీనివల్ల కంటోన్మెంట్ అభివృద్ధి కుంటుపడుతోంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ కు రావాల్సిన నిధులు విడుదల చేయాలి.

లేకపోతే కోర్టుకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను కంటోన్మెంట్ బోర్డు రాబట్టుకోవాలి. కంటోన్మెంట్ లో వచ్చిన ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దొంగిలిస్తోది. ఇది నియమ, నిబంధనలకు విరుద్ధం. కేంద్రం నుంచి కంటోన్మెంట్ కు రావాల్సిన నిధులను తక్షణమే విడుదల చేయించేలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపాలి” అని రేవంత్ రెడ్డి అన్నారు.

Karnataka Polls: పోలింగ్ మధ్యలో పొట్లాట.. మంగళూరులో జేడీఎస్, కాంగ్రెస్ కార్యకర్తల బాహాబాహీ