Andhra Pradesh : కొత్తగా 1,502 కరోనా కేసులు.. 16 మంది మృతి
గడిచిన 24 గంటలో ఆంధ్ర ప్రదేశ్ లో 1,502 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనా కారణంగా 16 మంది మరణించారు.

Andhra Pradesh
Andhra Pradesh : గడిచిన 24 గంటలో ఆంధ్ర ప్రదేశ్ లో 1,502 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనా కారణంగా 16 మంది మరణించారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 20,19,702 మంది కరోనా బారిన పడగా, 19,903 మంది కరోనాతో మృతి చెందారు. గత 24 గంటల్లో 1,525 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని ఇళ్లకు వెళ్లారు.
జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలను ఒకసారి పరిశీలిస్తే..
అనంతపురం 21, చిత్తూరు 208, తూర్పుగోదావరి 191, గుంటూరు 143, కడప 113, కృష్ణ 129, కర్నూలు 20, నెల్లూరు 260, ప్రకాశం 152, శ్రీకాకుళం 38 విశాఖపట్నం 64, విజయనగరం 17, వెస్ట్ గోదావరి 146
ఏ జిల్లాలో ఎంతమంది మృతి చెందారు
చిత్తూరు – నలుగురు, కృష్ణా – ముగ్గురు, పశ్చిమ గోదావరి -ముగ్గురు, తూర్పుగోదావరి -ఇద్దరు, గుంటూరు – ఇద్దరు, కర్నూలు, ప్రకాశం జిల్లాలో ఒకరు చొప్పున మృతి చెందారు.