AP Cabinet: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. పూర్తి వివరాలు ఇవిగో
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు.

YS Jagan
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం అమరావతిలోని సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు.
మహిళా సాధికారతకు, స్వావలంబనకు వెన్నుదన్నుగా నిలుస్తూ… ఫిబ్రవరి 16 నుంచి నాలుగో విడత వైఎస్సార్ చేయూత కార్యక్రమం చేపడతామన్నారు. ఫిబ్రవరి 16 నుంచి రెండు వారాలపాటు వైఎస్సార్ చేయూత లబ్ధి పంపిణీ జరుగుతుందని తెలిపారు.
ఈ విధంగా.. మ్యానిఫెస్టోలో ఇచ్చిన మరో ముఖ్యమైన హామీ అమలు చేస్తున్నామని తెలిపారు. నాలుగేళ్లలో ప్రతి మహిళకూ రూ.75వేలు అందించామన్నారు. నాలుగో విడతలో 26,98,931 మందికి రూ.5060.4 కోట్లు ఇస్తున్నామన్నారు. ఈ పథకం వల్ల దాదాపు 14 లక్షల మంది మహిళలు స్వయం ఉపాధి ద్వారా లబ్ధి పొందారని చెప్పారు. వీరందరి జీవితాలు బాగుపడ్డాయన్నారు. నెలకు అదనపు ఆదాయం రూ.7–10వేల వరకూ సంపాదించుకునే అవకాశం ఏర్పడిందని చెప్పారు.
పూర్తి వివరాలు (ఏపీ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం)
- 2020 ఆగస్టు 12న మొదటి విడతలో 24,00,11 మందికి రూ.4500.2 కోట్లు పంపిణీ
- రెండో విడతలో రూ.4,679 కోట్లు, 24.95 లక్షల మందికి పంపిణీ
- మూడో విడతలో 26.39 లక్షల మంది మహిళలకు రూ.4.949 కోట్లు పంపిణీ
- ఇప్పుడు నాలుగో విడత కింద 26.98 లక్షల మంది పేద ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ.18,750 చొప్పున రూ.5060 కోట్లు పంపిణీ
- దీంతో ప్రతి అక్కచెల్లెమ్మకు రూ.75 వేల లబ్ధి
- దీంతో ఈ పథకం కింద నాలుగు విడతల కలిపి సుమారు రూ.19,188 కోట్ల పంపిణీ
- ప్రతి గ్రామపంచాయతీకి తప్పనిసరిగా పంచాయతీ కార్యదర్శి ఉండాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం
- 500లోపు జనాభా ఉన్న పంచాయతీలకూ సెక్రటరీల నియామకం
- ఒక గ్రామ పంచాయతీలో ఒకరికన్నా ఎక్కువ ఉన్నవారిని ఈ పంచాయతీల్లో నియమించనున్న ప్రభుత్వం
నిరుద్యోగులకు శుభవార్త.. మెగా డీఎస్సీ..
- రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్న కీలక నిర్ణయానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం
- డీఎస్సీ–2024 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యాశాఖ, గిరిజన సంక్షేమం, సాంఘిక, బీసీ సంక్షేమశాఖల పరిధిలోని స్కూళ్లలో 6,100 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం
- 2019 నుంచి ఒక్క విద్యారంగంలోనే 14,219 టీచర్ పోస్టులను భర్తీచేసిన ప్రభుత్వం
- సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్ దృష్ట్యా ఏర్పడిన 7,761 పోస్టులను దీంట్లో భాగంగా భర్తీచేసిన ప్రభుత్వం
- డీఎస్సీలో అర్హులైన అభ్యర్ధులకు దరఖాస్తు చేసుకునేందుకు 42 ఏళ్ల వయో పరిమితి
- ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల వయోపరిమితిని సడలింపు
- రాష్ట్ర వ్యాప్తంగా 185 సెంటర్లలో 15 రోజుల పాటు పరీక్షల నిర్వహణ
- 8 రోజుల పాటు టెట్ నిర్వహణ
- అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం
- ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్లు సహా వివిధ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ
- ఇప్పటికే 2.13 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రస్తుత ప్రభుత్వం
- తాజా నోటిఫికేషన్ల ద్వారా మరో 7వేల పోస్టుల భర్తీ
- మొత్తం 2.20లక్షల పోస్టుల భర్తీ
- ఎస్ఈఆర్టీలోకి ఐబీ
- ఎస్ఈఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యం
- ఇది చరిత్రాత్మక ఘట్టమని పేర్కొన్న కేబినెట్
- పేదలకు, సంపన్నులకు తేడా నాణ్యమైన విద్యమాత్రమే
- ఇదే ఐబీ విద్యవిధానం కావాలనుకుంటే ఏడాదికి రూ.7 లక్షల నుంచి రూ.36 లక్షల వరకూ చెల్లిస్తున్న పరిస్థితులున్నాయన్న కేబినెట్.
- సంపన్నుల పిల్లలకు అందుబాటులో ఉండే డిజిటల్ సదుపాయాలు, ఐఎఫ్పీలు, ట్యాబులను మన పేదపిల్లలకు అందుబాటులోకి తీసుకు వచ్చాం
- దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్తూ నాణ్యమైన విద్యను అందించడానికి బోధనలో ఐబీని భాగస్వామ్యం చేస్తున్నాం
- మన రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ల పిల్లలు ప్రపంచస్థాయి ఉద్యోగాలను అందుకోవాలన్నదే లక్ష్యం
- ఇవాళ ఒకటో తరగతి విద్యార్థి తన చదువు పూర్తిచేసుకునే సమయానికి అత్యంత సమర్థతను సంతరించుకుంటాడు
- ఐబీ కూడా ముందుకు రావడం హర్షణీయం
- ప్రభుత్వంతో ఒప్పందం కారణంగా ఐబీ సంస్థ ఉదారంగా ముందుకు వచ్చింది
- సంపన్నుల పిల్లలకే కాదు నిరుపేదలకూ తాము సేవలందిస్తామని ఐబీ ముందుకు వచ్చింది
- 2024–25లో ఉపాధ్యాయులకు, విద్యాశాఖ అధికారులతో పాటు సంబంధిత ఇతర అధికార్లకూ శిక్షణ ఇచ్చి వారి సామర్ధ్యాన్ని, నైపుణ్యాలను పెంచి 2025 జూన్ నుంచి ఒకటో తరగతిలో ఐబీ
- జూన్ 2026 నాటికి రెండో తరగతిలో ఐబీ.. ఇలా ప్రతి ఏటా ఒక్కో తరగతి పెంచుకుంటూ.. 2035 నాటికి టెన్త్ క్లాస్ ఐబీ, 2037 నాటికి పన్నెండోతరగతి విద్యార్థులు ఐబీలో పరీక్షలు రాస్తారు
- ఇంకా..
- రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్ధల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది పదవీవిరమణ వయోపరిమితిని 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం
- ఏపీ డిస్కమ్స్కు రూ.1500 కోట్ల రుణాలపై ప్రభుత్వ గ్యారంటీకి కేబినెట్ ఆమోదం
- అత్యంత మారుమూల గిరిజన ప్రాంతాల్లో పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూపు(పీవీజీటీ) ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు రూ.89.98 కోట్లతో ఏపీడీస్కమ్స్ రూపొందించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టును ఆమోదించిన మంత్రిమండలి
- 1500 మెగావాట్ల సామర్ధ్యంతో సౌరవిద్యుత్ ఉత్పత్తికి గ్రీన్కో ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీకి కేబినెట్ ఆమోదం
నంద్యాల జిల్లా గడివేముల మండలం చిన్నక్కపల్లెలో 1272.07 ఎకరాలు, మిడ్తూరు మండలం మాసాపేట, నాగలూటి గ్రామాల్లో 1011.44 ఎకరాలు, కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడలో అవసరమైన భూములు గుర్తింపు - 3350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్లను ఏర్పాటు చేయనున్న జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్
- వైయస్సార్ జిల్లా చక్రాయపేట వద్ద 400 మెగావాట్లు, సత్యసాయి జిల్లా ముదిగుబ్బవద్ద 1050 మెగావాట్లు, అనంతపురం జిల్లా కనగానపల్లె, రాప్తాడుల్లో 1050 మెగావాట్లు, అనంతపురం జిల్లాలో డి.హీరేహాల్, బొమ్మనహాళ్ 850 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటు
- దాదాపు రూ. 12,065 కోట్ల పెట్టుబడి పెట్టనున్న జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్
- ఈ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా 3300 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు
- ఆమోదం తెలిపిన కేబినెట్
- నంద్యాల జిల్లా అవుకు మండలం కునుకుంట్ల, కర్నూలు జిల్లా ప్యాపిలిమండలం జలదుర్గం వద్ద రెండు విండ్పవర్
- ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్న జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్
- 171.60 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు
- రూ.1287 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా 200 మందికి ఉద్యోగాలు
- వీటికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి
- శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం పులిగుండ్లపల్లెలో 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ను ఏర్పాటు చేయనున్న
- ఆగ్వాగ్రీన్ ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్
- రూ.4వేల కోట్లు ఖర్చు చేయనున్న కంపెనీ
- వేయి మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు
- వీటికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి
- కర్నూలు జిల్లా ఆస్పరి వద్ద 200 మెగావాట్ల విండ్పవర్ ప్రాజెక్ట్ను ఏర్పాటు చేయనున్న ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
- రూ.1350 కోట్లు ఖర్చు, 200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు
- 4వ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రిపోర్టుకు కేబినెట్ ఆమోదం
- ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ఇన్సూరెన్స్ ఫండ్ రూల్స్ 2024 ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం
- చట్టసభలకు కొత్తగా ఎన్నికైన సభ్యులకు, అధికార్లకు, చట్టసభల సిబ్బందికి, ఇతర ప్రభుత్వ అధికార్లకు శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు అసెంబ్లీ ప్రాంగణంలో ఏపీ లెజిస్లేచర్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లెజిస్లేటివ్ స్టడీస్ అండ్ ట్రైనింగ్ సంస్ధ ఏర్పాటు చేయడంతో పాటు డైరెక్టర్(నాన్ కేడర్) పోస్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
- ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ సెక్రటేరియట్లో 27 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం
- ఆంధ్రప్రదేశ్ అడ్వోకేట్స్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ –1987 సవరణలకు కేబినెట్ ఆమోదం
- ఆంధ్రప్రదేశ్ అడ్వోకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ –1992 సవరణలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
- పల్నాడు జిల్లా పులిచింతల ప్రాజెక్టు పరిధిలో 5376 నిర్వాసిత కుటుంబాలకు… ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో భాగంగా ఇస్తున్న ఇళ్ల పట్టాలు, ఇళ్లకు సంబంధించిన రూ.52 కోట్ల స్టాంప్ డ్యూటీ, రూ.8 కోట్ల రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జీలను మినహాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం
- ప్రముఖ చెస్ క్రీడాకారిణి కుమారి కోలగట్ల అలనా మీనాక్షికి విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలో 500 గజాల నివాస స్ధలాన్ని కేటాయించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం
అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేనికి విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలో 1000 చదరపు గజాల నివాసస్ధలాన్ని కేటాయించాలన్న ప్రతిపాదనలకూ కేబినెట్ ఆమోదం - తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మల్లవారిపాలెంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐఐటీ), శ్రీసిటీ ఏర్పాటుకు అవసరమైన 42.23 ఎకరాల భూమిని కేటాయించాలన్న నిర్ణయానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్
Ravela Kishore Babu : వైసీపీలో చేరిన మాజీమంత్రి రావెల కిశోర్ బాబు..