మేము సిద్ధంగా ఉన్నాం.. మీ సూచనలు చాలా ముఖ్యం.. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
గతంలో ఏపీలో పనిచేయాలంటే ఐఏఎస్, ఐపీఎస్ లు పోటీ పడేవారు. కానీ, గత ఐదేళ్లలో ఏపీలో పనిచేయాలంటే కొంతమంది భయపడిపోయారు.
![మేము సిద్ధంగా ఉన్నాం.. మీ సూచనలు చాలా ముఖ్యం.. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మేము సిద్ధంగా ఉన్నాం.. మీ సూచనలు చాలా ముఖ్యం.. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్](https://10tv.in/wp-content/uploads/2024/08/Deputy-CM-Pawan-Kalyan.jpg)
Deputy CM Pawan Kalyan
Deputy CM Pawan Kalyan : ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది. సోమవారం వెలగపూడిలో జరిగిన ఈ కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఎన్నో అవమానాలు భరించాం. వ్యక్తిగతంగా, కుటుంబ సభ్యులనుసైతం జగన్ ప్రభుత్వం అవమానించింది. వ్యవస్థలను బలోపేతం చేయడంకోసం దెబ్బలు తిన్నాం, భరించాం. ఉమ్మడి ఏపీలోకూడా ఇటువంటి ఇబ్బందులు పడలేదు. మా కూటమిని ప్రజలు ఆశీర్వదించారు.. అధికారం ఇచ్చారని పవన్ కల్యాణ్ అన్నారు.
Also Read : అలాచేస్తే ఎవర్నీ వదిలిపెట్టను.. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
గతంలో ఏపీలో పనిచేయాలంటే ఐఏఎస్, ఐపీఎస్ లు పోటీ పడేవారు. కానీ, గత ఐదేళ్లలో ఏపీలో పనిచేయాలంటే కొంతమంది భయపడిపోయారు. గత జగన్ ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని పవన్ కల్యాణ్ అన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా మరుగుదొడ్లు నిర్మాణం చేపడతాం. మంచినీరు అన్ని గ్రామాలకు అందించడమే మాలక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనాదక్షత నేర్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జగన్ ప్రభుత్వం పాలనను ఛిద్రం చేసింది. ఐఏఎస్, ఐపిఎస్ లను ఆటబొమ్మలు చేయడం బాధ కలిగించింది. రాజ్యాంగాన్ని కాపాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ కోసం మేము కష్టపడుతాం. చంద్రబాబు అనుభవం, దార్శనికత నేర్చుకోవడానికి మేము సిద్దంగా ఉన్నాం. రాజ్యాంగాన్ని కాపాడటంలో మమ్మల్ని చంద్రబాబు గైడ్ చేస్తారని భావిస్తున్నామని పవన్ అన్నారు.
Also Read : Vemulawada : వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో బ్రేక్ దర్శనం ప్రారంభం.. టికెట్ ధర ఎంతంటే?
మా నుండి తప్పులు ఉంటే అధికారులు తెలియజేయాలి. మేము సరిదిద్దుకుంటామని పవన్ చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం అనేక అవమానాలు ఎదుర్కొన్నాం. స్కిల్ సెన్స్ కోసం అధికారుల సలహాలు, సూచనలు అవసరం. వికసిత ఆంద్రప్రదేశ్ కోసం అధికారులు సూచనలు చాలా ముఖ్యం అని పవన్ కల్యాణ్ అన్నారు.