ఏపీలో కరోనా పంజా, 329కి చేరిన బాధితులు, 15 గంటల్లో 15 కేసులు

ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోది. ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 329కి పెరిగింది. బుధవారం(ఏప్రిల్ 8,2020) మరో 15 కొత్త కేసులు నమోదయ్యాయి.

  • Published By: veegamteam ,Published On : April 8, 2020 / 05:39 AM IST
ఏపీలో కరోనా పంజా, 329కి చేరిన బాధితులు, 15 గంటల్లో 15 కేసులు

Updated On : April 8, 2020 / 5:39 AM IST

ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోది. ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 329కి పెరిగింది. బుధవారం(ఏప్రిల్ 8,2020) మరో 15 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 329కి పెరిగింది. బుధవారం(ఏప్రిల్ 8,2020) మరో 15 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా నెల్లూరులో 6, కృష్ణాలో 6, చిత్తూరు జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులపై తాజాగా వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 

రాష్ట్రంలో మొదలైన కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి:
రాష్ట్రంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి మొదలైందని, అది ప్రాథమిక స్థాయిలో ఉందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. రాబోయే రోజుల్లో 2-3 లక్షల ర్యాపిడ్ టెస్ట్ లు చేసేందుకు ఆరోగ్యశాఖ రెడీ అవుతోంది. ఆరోగ్య సిబ్బంది ప్రత్యేక సర్వే ద్వారా కరోనా లక్షణాలతో ఉన్న 5వేల మందిని గుర్తించారు. వారిలో 1800-2000 మందికి పరీక్షలు అవసరమని భావిస్తున్నారు. 3 లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్ లను దిగుమతి చేసుకుంటున్నామని,  రాబోయే రోజుల్లో 2-3 లక్షల ర్యాపిడ్ టెస్ట్ లు చేస్తామని అధికారులు తెలిపారు. ఇందుకు ప్రైవేటు ల్యాబ్ లనూ సంప్రదిస్తున్నామన్నారు. (హిందూ మహిళపాడేను మోసి అంత్యక్రియలు చేసిన ముస్లిం యువకులు)

40 లక్షల గ్లోవ్స్, 12 లక్షల సర్జికల్ మాస్క్ లు, 20లక్షల హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు:
టీబీ పరీక్షలు చేసే ట్రూనాట్ సెంటర్లలో కరోనా పరీక్షలు చేయొచ్చని ఐసీఎంఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. ఏపీలో 240 ట్రూనాట్ సెంటర్లున్నాయి. 20 లక్షల పీపీఈలు, 14 లక్షల ఎన్-95 మాస్కులు సిద్ధం చేస్తున్నారు. 40 లక్షల గ్లోవ్స్, 12 లక్షల సర్జికల్ మాస్క్ లు ఉన్నాయి. హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు 20 లక్షలు, అజిత్రోమైసిన్ 14 లక్షలు సిద్ధంగా ఉంచామని అని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు.వెల్లడించారు.

* నెల్లూరు జిల్లాలో 49కి చేరిన కరోనా కేసులు
* కృష్ణా జిల్లాలో 35కి చేరిన కరోనా కేసులు
* చిత్తూరు జిల్లాలో 20కి చేరిన కరోనా కేసులు
* కరోనాతో రాష్ట్రంలో ఇప్పటివరకు నలుగురు మృతి
* రాష్ట్రంలో కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న వారు ఆరుగురు