Ratan Tata death : రతన్ టాటా మృతిపట్ల ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, పలువురు రాజకీయ నేతల సంతాపం!
Ratan Tata death : రతన్ టాటా మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ కూడా తన సంతాపాన్ని తెలియజేశారు. టాటా మెరుగైన సమాజం కోసం ఆయనెంతో కృషి చేశారని ట్విట్టర్ వేదికగా కొనియాడారు.

Ratan Tata death : ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ ఛైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటా (86) కన్నుమూశారు. పారిశ్రామికవేత్తలు, గ్లోబల్ లీడర్లు, సామాన్య ప్రజలతో సహా సోషల్ మీడియా అంతటా రతన్ టాటా మరణం పట్ల తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. రతన్ టాటా ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా ఇక లేరనే విషయాన్ని టాటా గ్రూప్ బుధవారం అర్థరాత్రి ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ ట్విట్టర్ వేదికగా తన సంతాపాన్ని తెలియజేశారు.
Read Also : దేశం గర్వించదగ్గ పారిశ్రామికవేత్త రతన్ టాటా…
రతన్ టాటా ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు. మెంటార్, గైడ్ మాత్రమే కాదు.. మంచి స్నేహితుడు కూడా అన్నారు. పనిపట్ల ఆయన నిబద్ధతతో పాటు నిజాయితీ, అంతర్జాతీయంగా ముద్ర వేశారని చెప్పారు. సమాజ సేవ పట్ల రతన్ టాటా అంకితభావం ఎంతోమందికి మేలు చేసిందని చెప్పారు. టాటా కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
రతన్ టాటా మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ కూడా తన సంతాపాన్ని తెలియజేశారు. టాటా మెరుగైన సమాజం కోసం ఆయనెంతో కృషి చేశారని ట్విట్టర్ వేదికగా కొనియాడారు. ‘‘రతన్ టాటా దూరదృష్టి కలిగిన పారిశ్రామిక వేత్త. దయగల అసాధారణ వ్యక్తి. భారత్లో ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారు.
ఎంతోమందికి ఆయన ఆప్తుడిగా నిలిచారు’’ అంటూ మోదీ పేర్కొన్నారు. ముఖ్యంగా విద్య, ఆరోగ్య సంరక్షణ, పారిశుధ్యం, జంతు సంక్షేమం వంటి రంగాలలో దాతృత్వం, సామాజిక కారణాల పట్ల టాటా నిబద్ధతను కూడా ప్రధాన మంత్రి ప్రశంసించారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా రతన్ టాటా మృతి పట్ల సంతాపం తెలియజేశారు.
Shri Ratan Tata Ji was a visionary business leader, a compassionate soul and an extraordinary human being. He provided stable leadership to one of India’s oldest and most prestigious business houses. At the same time, his contribution went far beyond the boardroom. He endeared… pic.twitter.com/p5NPcpBbBD
— Narendra Modi (@narendramodi) October 9, 2024
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా రతన్ టాటా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయనను విజన్ కలిగిన వ్యక్తిగా అభివర్ణించారు. “రతన్ టాటా ఒక విజన్ ఉన్న వ్యక్తి. ఆయన వ్యాపారం, దాతృత్వం రెండింటిలోనూ శాశ్వతమైన ముద్ర వేశారు. ఆయన కుటుంబానికి, టాటా కమ్యూనిటీకి నా సానుభూతి” అని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఎక్స్ వేదికగా “లెజెండరీ పారిశ్రామికవేత్త.. నిజమైన జాతీయవాది.. ఆయన మరణం చాలా బాధ కలిగించింది” అన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రతన్ టాటా మృతి పట్ల సంతాపం తెలియజేశారు. భారతీయ పరిశ్రమకు నిజమైన టైటాన్, వినయం, కరుణ కలిగిన మార్గదర్శిగా కొనియాడారు.
“భారత్ ఒక దిగ్గజాన్ని కోల్పోయింది. కానీ, ఆయన వారసత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఆయన కుటుంబానికి, సహచరులకు, మొత్తం టాటా గ్రూప్కు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని స్టాలిన్ ఎక్స్లో పోస్ట్ పేర్కొన్నారు.
Saddened by the passing away of Shri Ratan Tata. He was a Titan of the Indian industry known for his monumental contributions to our economy, trade and industry. My deepest condolences to his family, friends and admirers. May his soul rest in peace.
— Rajnath Singh (@rajnathsingh) October 9, 2024
రతన్ టాటా మృతిపై పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ట్విట్టర్ వేదికగా సంతాపాన్ని తెలియజేశారు. “గడియారం టిక్ టిక్ అనడం ఆగిపోయింది. టైటాన్ గడిచిపోయింది. #రతన్ టాటా సమగ్రత, నైతిక నాయకత్వం, దాతృత్వానికి దారితీసింది. ఆయన వ్యాపార ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు” అంటూ పేర్కొన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా రతన్ టాటా మృతిపట్ల సంతాపం తెలియజేశారు. టాటాను “కార్పోరేట్ వృద్ధిని దేశ నిర్మాణంతో” కలిపిన చిహ్నంగా అభివర్ణించారు.
ప్రముఖ వ్యాపార ప్రముఖుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన ముఖేష్ అంబానీ కూడా రతన్ టాటా మృతిపట్ల సంతాపాన్ని ప్రకటించారు. ఆయన మరణం “వ్యక్తిగత నష్టం”గా అభివర్ణించారు. ఆయనతో కలిసి చేసిన అనేక విషయాలు ఎంతో స్ఫూర్తిని, శక్తినిచ్చాయన్నారు. రతన్, నువ్వు ఎప్పుడూ నా హృదయంలో ఉంటావు. ఓం శాంతి.” అంటూ అంబానీ పేర్కొన్నారు.
గౌతమ్ అదానీ టాటాను “ఆధునిక భారత మార్గాన్ని పునర్నిర్వచించిన దిగ్గజంగా పేర్కొన్నారు. దూరదృష్టి కలిగిన వ్యక్తిగా అభివర్ణించారు. రతన్ వంటి దిగ్గజాలు ఎప్పటికీ మసకబారలేదు” అని ఉద్ఘాటించారు.