Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే..

Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎంతంటే?

Gold Price

Updated On : October 19, 2023 / 7:39 AM IST

Gold and Silver Rate Today 19th October 2023: భారత్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ఖరీదైనవిగా మారాయి. రెండు రోజులుగా వరుసగా తగ్గిన బంగారం ధర గురువారం స్వల్పంగా పెరిగింది. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తులం బంగారంపై రూ. 10 పెరిగింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 55,460 వద్దకు చేరుకోగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,500కి చేరింది. మరోవైపు వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. కిలో వెండి 78వేల వద్ద కొనసాగుతుంది.

Gold

Gold

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం రూ. 55,460 కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ. 60,500 వద్ద కొనసాగుతుంది.

gold

gold

దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,610 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ. 60,650కు చేరింది.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 55,460 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,500 వద్ద కొనసాగుతుంది.
– చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 55,660 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,720 వద్దకు చేరింది.

Gold

Gold

స్థిరంగా వెండి ధర ..
దేశ వ్యాప్తంగా వెండి ధరల్లో గురువారం ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. గురువారం ఉదయం నమోదైన ధరల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 78,000 కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 78,000 వద్ద కొనసాగుతుంది. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాలలో రూ.74,600గా ఉంది. బెంగళూరులో వెండి ధర పెరిగింది. కిలో వెండిపై రూ. 1500 పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి రూ.74,000 వద్దకు చేరింది.