Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
గత కొద్దిరోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఆదివారంసైతం బంగారం ధర భారీగా పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 600 పెరగ్గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పై రూ. 660 పెరిగింది.

Gold
Today Gold and Silver Rate : భారత్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ఖరీదైనవిగా మారుతున్నాయి. ముఖ్యంగా బంగారం ధర భారీగా పెరుగుతోంది. వరుస పండుగల నేపథ్యంలో మహిళలు బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే, ప్రస్తుతం పెరుగుతున్న ధరలతో బంగారం కొనుగోలుకు మహిళలు వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి. గత కొద్దిరోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఆదివారంసైతం బంగారం ధర భారీగా పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 600 పెరగ్గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పై రూ. 660 పెరిగింది. మరోవైపు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ధర ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం రూ. 57,400 కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ. 62,620కు చేరుకుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,550 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ. 62,770కి చేరింది.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 57,400కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,620 కు చేరింది.
– చెన్నైలో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.57,700 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.62,950 వద్దకు చేరింది.
స్థిరంగా వెండి ధర ..
దేశవ్యాప్తంగా వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 77,500 వద్ద కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,500. ముంబయి, ఢిల్లీ, కోల్కతా ప్రాంతాలలో కిలో వెండి రూ.74,600 వద్ద కొనసాగుతుంది. బెంగళూరులో కిలో వెండి రూ.73,750 వద్ద కొనసాగుతుంది.