Gold Price: భారీగా పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం, కిలో వెండి ధరలు ఎంతంటే?
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే..

Gold Price
Today Gold and Silver Rate: దేశవ్యాప్తంగా బంగారం ధర భారీగా పెరిగింది. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పై రూ. 400 పెరిగింది. 24 క్యారెట్ల గోల్డ్ పై రూ. 440 పెరిగింది. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ. 58,850 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రూ. 64,200 కు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,000 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 64,350.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 58,850 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 64,200కు చేరింది.
– చెన్నైలో 10 గ్రాముల గోల్డ్ పై రూ. 600 పెరిగింది. దీంతో అక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.59,750 కాగా, 24క్యారెట్ల గోల్డ్ రూ.65,180కు చేరింది.
స్థిరంగా వెండి ధర ..
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 83,500కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 83,500. ముంబయి, ఢిల్లీ, కోల్కతా ప్రాంతాలలో కిలో వెండి రూ.80,500 కు చేరింది. బెంగళూరులోనూ వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో అక్కడ కిలో వెండి రూ.79,000 వద్ద కొనసాగుతుంది.