Gold Price Today: స్వల్పంగా పెరిగిన గోల్డ్ ధర.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎంతంటే?

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల 22క్యారెట్ల బంగారంపై ..

Gold Price Today: స్వల్పంగా పెరిగిన గోల్డ్ ధర.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎంతంటే?

Gold

Updated On : October 7, 2023 / 7:08 AM IST

Gold and Silver Rate Today 7th October 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. గత కొద్దిరోజులుగా 10 గ్రాముల బంగారంపై సుమారు రూ. 3వేలకుపైగా తగ్గుదల చోటు చేసుకుంది. రానున్న రోజుల్లోనూ బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో దసరా, దీపావళి పండుగల సందడి మొదలైంది. దీంతో బంగారం కొనుగోలుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. అయితే, సుమారు పదిరోజుల తరువాత శనివారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల గోల్డ్ పై రూ. 100 పెరుగుదల చోటు చేసుకుంది. మరోవైపు వెండి ధరలు తగ్గాయి. కిలో వెండిపై రూ. 500 తగ్గింది.

 

Gold

Gold

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దీంతో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. శనివారం ఉదయం 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం రూ. 52,500కి చేరింది. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ. 57,230 వద్ద కొనసాగుతుంది.

Gold

Gold

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,650 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ. 57,380 వద్దకు చేరింది.
– చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,850 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,650.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 52,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,230 వద్ద కొనసాగుతుంది.

Gold

Gold

స్వల్పంగా తగ్గిన వెండి ధర..
దేశ వ్యాప్తంగా వెండి ధర స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై రూ. 500 తగ్గుదల చోటు చేసుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 73,000 వద్దకు చేరింది. దేశంలోని ప్రధాన నగరాలైన చెన్నైలో కిలో వెండి ధర రూ. 73,000 కాగా, ముంబయి, ఢిల్లీ, కోల్ కతాలలో రూ.70,600 వద్ద కొనసాగుతుంది. బెంగళూరులో కిలో వెండిపై రూ.200 మాత్రమే తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి రూ. 69,800 వద్ద కొనసాగుతోంది.