రాకాసి కరోనా, 157 దేశాలకు వ్యాపించిన వైరస్, 6వేల 515మంది మృతి

కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకి కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు 157 దేశాలకు స్ప్రెడ్ అయ్యింది. రోజు

  • Published By: veegamteam ,Published On : March 16, 2020 / 01:55 AM IST
రాకాసి కరోనా, 157 దేశాలకు వ్యాపించిన వైరస్, 6వేల 515మంది మృతి

Updated On : March 16, 2020 / 1:55 AM IST

కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకి కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు 157 దేశాలకు స్ప్రెడ్ అయ్యింది. రోజు

కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకి కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు 157 దేశాలకు స్ప్రెడ్ అయ్యింది. రోజు రోజుకి కరోనా మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 6వేల 515మంది చనిపోయారు. అలాగే కరోనా బారిన పడే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. లక్ష 69వేల 415 మంది కరోనా బారిన పడ్డారు. 5వేల 921మందికి సీరియస్ గా ఉంది.

చైనాలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. అదే సమయంలో ఇటలీ, ఇరాన్, స్పెయిన్ లో ఒక్కసారిగా కరోనా విజృంభించడం కలకలం రేపుతోంది. నిన్న ఒక్క రోజే ఇటలీ, స్పెయిన్ లో కరోనా కట్టలు తెచ్చుకుంది. 4వేల 500 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. 2019 డిసెంబర్ లో చైనాలో వుహాన్ లో కరోనా వెలుగు చూసింది. ఇప్పటివరకు వ్యాక్సిన్ కనిపెట్టలేకపోయారు.

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను క్రమంగా కమ్మేస్తోంది. కరోనా దెబ్బకు ప్రపంచం విలవిలలాడుతోంది. దాన్ని నియంత్రించటానికి ఆయా దేశాలు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నాయంటే కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. భారత్ లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. 110 కేసులు నమోదయ్యాయి. కరోనాను డబ్ల్యూహెచ్ వో మహమ్మారిగా గుర్తించింది. మన దేశం కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించింది.

కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే మార్చి 31 వరకు విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. అలాగే థియేటర్లు, పబ్ లు, స్విమ్మింగ్ పూల్స్ మూసివేశారు. పార్లమెంట్ సముదాయంలోకి సందర్శకులకు ఎంట్రీ నిషేధించారు. అంతర్జాతీయ సరిహద్దుల దగ్గర ఆంక్షలు విధించారు.

* 157 దేశాలకు విస్తరించిన కరోనా వైరస్
* ప్రపంచవ్యాప్తంగా 6వేల 515 మందికి పైగా మృతి
* 1,69,415 మందికి చేరిన కరోనా వైరస్ బాధితులు
* 5వేల 921 మందికి సీరియస్

* కరోనా వైరస్ తో చైనాలో 3,199 మృతి
* ఇటలీలో 1,441
* ఇరాన్ లో 724
* స్పెయిన్ లో 288
* ఫ్రాన్స్ లో 91
* దక్షిణ కొరియాలో 75
* అమెరికాలో 60కి చేరి మృతుల సంఖ్య
* చైనాలో తగ్గిన కరోనా అనుమానిత కేసులు
* చైనా తర్వాత ఇటలీ, ఇరాన్, స్పెయిన్ లో కరోనా విజృంభణ
* నిన్న ఒక్క రోజే ఇటలీ, స్పెయిన్ లో 4వేల 500 కేసులు నమోదు

Also Read | యువకుడిపై అమృత కంప్లయింట్..ఎందుకు ?