Social Media Accounts Blocked: పాకిస్తాన్ ప్రముఖ సింగర్ అతిఫ్ అస్లాం, యాక్టర్ ఫవాద్ ఖాన్లకు భారత్ బిగ్ షాక్..
భారతదేశంలో ఖాతా అందుబాటులో లేదు. ఈ కంటెంట్ను పరిమితం చేయాలనే చట్టపరమైన అభ్యర్థనను మేము పాటించినందున ఇది జరిగింది.

Social Media Accounts Blocked: పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ కు చెందిన పలు యూట్యూబ్ ఛానల్స్, ఇతర సోషల్ మీడియా ఖాతాలను మన దేశంలో బ్లాక్ చేస్తోంది భారత ప్రభుత్వం. ఇప్పటికే పలువురి సోషల్ మీడియా అకౌంట్లను భారత్ బ్లాక్ చేసింది. తాజాగా పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్, గాయకుడు అతిఫ్ అస్లాంల ఇన్స్టాగ్రామ్ ఖాతాలను భారత్ లో బ్లాక్ చేసింది ప్రభుత్వం.
ఈ ఇద్దరు పాకిస్తానీ కళాకారుల ఇన్స్టాగ్రామ్ ఖాతాలలో “భారతదేశంలో ఖాతా అందుబాటులో లేదు. ఈ కంటెంట్ను పరిమితం చేయాలనే చట్టపరమైన అభ్యర్థనను మేము పాటించినందున ఇది జరిగింది” అని ఒక సందేశం కనిపిస్తుంది.
2014లో సోనమ్ కపూర్ సరసన “ఖూబ్సూరత్” చిత్రంలో నటించడం ద్వారా మిస్టర్ ఖాన్ బాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. “కపూర్ & సన్స్” “ఏ దిల్ హై ముష్కిల్” వంటి చిత్రాలలో తన పాత్రతో పాపులర్ అయ్యాడు. ఉగ్రదాడి తర్వాత అతడి తాజా చిత్రం “అబీర్ గులాల్” విడుదల కూడా సందిగ్ధంలో పడింది.
Also Read: పాకిస్థాన్ను కోలుకోలేని దెబ్బకొట్టేందుకు భారత్ భారీ వ్యూహం.. ఇక పాక్ ఖేల్ ఖతం.!
మిస్టర్ అస్లాం.. తూ జానే నా, తేరా హోనే లగా హూన్ (రెండూ అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ) పెహ్లీ నాజర్ మే (రేస్) వంటి ప్రముఖ బాలీవుడ్ ట్రాక్లను అందించడంలో ప్రసిద్ధి చెందాడు. అతను అనేక అవార్డులను గెలుచుకున్నాడు. ఫిల్మ్ఫేర్ అవార్డులకు కూడా నామినేట్ అయ్యాడు. ఇటీవలి రోజుల్లో మహిరా ఖాన్, హనియా అమీర్, అలీ జాఫర్ వంటి అనేక మంది పాకిస్తానీ కళాకారుల ఇన్ స్టా ఖాతాలను భారతదేశంలో బ్లాక్ అయ్యాయి. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ పరిణామం జరిగింది.
ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్లో వ్యాలీలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. వారిలో 24 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడు, ఒక స్థానిక వ్యక్తి ఉన్నారు. ఎక్కువ మంది టూరిస్టులే ఉన్నారు. ఈ దాడిలో భారత నావికాదళ అధికారి, ఇంటెలిజెన్స్ బ్యూరో సిబ్బంది కూడా మరణించారు.
2019 పుల్వామా దాడి తర్వాత లోయలో జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇది. పాకిస్తాన్కు చెందిన నిషేధిత లష్కరే తోయిబా (ఎల్ఇటి) ఉగ్రవాద సంస్థకు చెందిన షాడో గ్రూప్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి బాధ్యత వహించింది.
ఉగ్రదాడితో భారత్ తీవ్రంగా స్పందించింది. పాక్ పై చర్యలకు దిగింది. ఆ దేశంతో దౌత్య సంబంధాలను తగ్గించుకుంది. 1960 సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాక్ జాతీయులకు వీసా సేవలను రద్దు చేయడం వంటి అనేక చర్యలను ప్రకటించింది.
ప్రతీకారంగా, పాకిస్తాన్ కూడా వరుస చర్యలను ప్రకటించింది. ఒప్పందం ప్రకారం దాని కోసం ఉద్దేశించిన నీటిని మళ్లించే ఏ చర్యనైనా “యుద్ధ చర్య”గా పరిగణిస్తామని ఇస్లామాబాద్ తెలిపింది. రెండు దేశాలు ఒకదానికొకటి తమ గగనతల ప్రాంతాలను మూసివేశాయి.