ఢిల్లీ బీజేపీ ఆఫీస్ లో 17మందికి కరోనా
ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో 17 మందికి కరోనా సోకింది. మంగళవారం రాష్ట్ర కార్యాలయంలోని సిబ్బంది, నేతలందరికీ కరోనా టెస్టులు నిర్వహించగా, 17మందికి పాజిటివ్ వచ్చినట్లు ఢిల్లీ యూనిట్ మీడియా సెల్ హెడ్ తెలిపారు. కరోనా సోకిన వారు హోం ఐసోలేషన్ లో ఉన్నారని తెలిపారు.
మరోవైపు, బిజెపి ఎంపి మీనాక్షి లేఖీతో సహా 26 మంది ఎంపీలకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొదటి రోజున కరోనా పాజిటివ్గా గుర్తించిన విషయం తెలిసిందే. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఎంపీలందరికి కరోనా టెస్టులు చేయగా 26 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్ గా తేలింది.
కాగా, ఢిల్లీలో ఇప్పటివరకు 2.25 లక్షల మందికి కరోనా సోకింది. మంగళవారం ఢిల్లీలో కొత్తగా 4,263 కరోనా వైరస్ సంక్రమణ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ రాజధానిలో మొత్తం సోకిన వారి సంఖ్య 2.25 లక్షలకు పెరిగింది. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,806 కు పెరిగిందని ఆరోగ్య శాఖ తెలిపింది.
17 people test COVID-19 positive at Delhi BJP office: party’s Delhi unit media cell head
— Press Trust of India (@PTI_News) September 15, 2020