COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 2,141 కరోనా కేసులు నమోదు

దేశంలో కొత్తగా 2,141 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 2,579 మంది కోలుకున్నారని చెప్పింది. ఇప్పటివరకు దేశంలో 4,40,82,064 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం కరోనాతో బాధపడుతూ ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 25,510గా ఉన్నట్లు చెప్పింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.85 శాతం ఉన్నట్లు పేర్కొంది.

COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 2,141 కరోనా కేసులు నమోదు

india corona cases

Updated On : October 20, 2022 / 10:46 AM IST

COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 2,141 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 2,579 మంది కోలుకున్నారని చెప్పింది. ఇప్పటివరకు దేశంలో 4,40,82,064 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం కరోనాతో బాధపడుతూ ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 25,510గా ఉన్నట్లు చెప్పింది.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.85 శాతం ఉన్నట్లు పేర్కొంది. వారాంతపు పాజిటివిటీ రేటు 0.97 శాతంగా ఉన్నట్లు చెప్పింది. రికవరీ రేటు 98.76 శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. దేశంలో వినియోగించిన కరోనా డోసుల సంఖ్య 219.46 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. వాటిలో రెండో డోసులు 94.98 కోట్లు ఉన్నట్లు పేర్కొంది.

బూస్టర్ డోసులు 21.96 కోట్లు ఉన్నట్లు తెలిపింది. నిన్న దేశంలో 4,90,711 కరోనా డోసులు వేసినట్లు వివరించింది. దేశంలో ఇప్పటివరకు 89.94 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు తెలిపింది. నిన్న దేశంలో 2,51,515 కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..