Kangana Ranaut : మళ్లీ యోగి గెలవాలి.. యూపీ బ్రాండ్ అంబాసిడర్గా కంగనా నియామకం!
ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ను ఉత్తరప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది సీఎం యోగీ ప్రభుత్వం. లక్నోలోని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది.
Kangana Ranaut Brand Ambassador: ప్రముఖ బాలీవుడ్ నటి, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ను ఉత్తరప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది సీఎం యోగీ ప్రభుత్వం. ఒకవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. అంతేకాదు.. బీజేపీతో కూడా దగ్గరగా మెలుగుతూ వస్తోంది. సినీగ్లామర్ ఉన్న కంగానాను యూపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ (ODOP) పథకానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తూ అధికారిక ప్రకటన జారీ చేసింది. ఈ సందర్భంగా కంగనా లక్నోలోని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది.
Posani Krishna Murali : పోసాని మిస్సింగ్.. ఆందోళనలో నిర్మాతలు..
ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి నవనీత్ షెగ్వాల్ ట్విట్టర్ వేదికగా ఫొటోలను షేర్ చేశారు. ODOP పథకానికి సినీనటి కంగనా రనౌత్ యూపీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహారిస్తారని తెలిపారు. కంగనా కూడా యోగితో భేటీ అయిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ యోగితో కంగనా భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. యూపీ రాష్ట్ర వ్యాప్తంగా 75 జిల్లాల్లో ప్రత్యేకమైన సంప్రదాయ పారిశ్రామిక హబ్స్ సృష్టించేందుకు ప్రభుత్వం ఈ One district-one product ప్రొగ్రామ్ ప్రవేశపెట్టింది.
Famous Actress Kangana Ranawat met @myogiadityanath Hon’ble Chief Minister UP, who presented her with an @UP_ODOP product. Kangna ji will be our Brand Ambassador for ODOP @CMOfficeUP pic.twitter.com/XUJTiStRqv
— Navneet Sehgal (@navneetsehgal3) October 1, 2021
యోగీతో భేటీలో కంగనా.. ప్రభుత్వ పనితీరు భేషుగ్గా ఉందంటూ ప్రశంసించినట్టు సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, మహిళా భద్రతకు ప్రభుత్వం చేపట్టిన విధానాలను ఆమె మెచ్చుకున్నట్టు పేర్కొన్నాయి. కంగనా రనౌత్ ట్విట్టర్ సస్పెండ్ కావడంతో యోగీతో భేటీకి సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్లో షేర్ చేసింది. అంతేకాదు.. రాబోయే యూపీ ఎన్నికల్లో యోగీ గెలవాలని కంగనా ఆకాంక్షించారు. రామ మందిర భూమి పూజలో వినియోగించిన రామ్ దర్బార్ నాణెన్ని కంగనాకు సీఎం యోగీ బహుమతిగా అందించారు. దానికి కంగనా కూడా థ్యాంక్స్ చెప్పింది. ప్రస్తుతం కంగనా సర్వేష్ మేవారా డైరెక్షన్లో ‘తేజస్’లో కంగనా IAF ఆఫీసర్ రోల్ చేస్తోంది.
Pushpa : పుష్ప రిలీజ్ డేట్ వచ్చేసింది.. సోలోగా వస్తున్న ఐకాన్ స్టార్