Special Trains : పూరి జగన్నాథ రథయాత్రకు ప్రత్యేక రైళ్లు
వీటిలో సికింద్రాబాద్-మాలతిపట్ పూర్, నాందేడ్-కుర్దారోడ్, కాచిగూడ, మాలతిపట్ పూర్ వంటి స్టేషన్ మధ్యలో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. బహనాగ బజరా రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లాల్సిన పది రైళ్లను ఈ నెల 18, 19 తేదీలలో రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

special trains
Puri Jagannath Rath Yatra : పూరి జగన్నాథ రథయాత్రకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. పూరిలో జూన్ 20 నుంచి ప్రారంభం కానున్న పూరి జగన్నాథ రథయాత్రకు ఆరు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే జోనల్ అధికారులు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లు జూన్ 18, 19, 20, 21, 22 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయని ప్రకటించారు.
వీటిలో సికింద్రాబాద్-మాలతిపట్ పూర్, నాందేడ్-కుర్దారోడ్, కాచిగూడ, మాలతిపట్ పూర్ వంటి స్టేషన్ మధ్యలో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. బహనాగ బజరా రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లాల్సిన పది రైళ్లను ఈ నెల 18, 19 తేదీలలో రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
వీటిలో షాలీమార్-హైదరాబాద్, సత్రగాచి-తిరుపతి, గౌహతి-సికింద్రాబాద్, హౌరా-పుదుచ్చేరి, చెన్నై సెంట్రల్- సత్రగాచి, మైసూర్-హౌరా, సికింద్రాబాద్-ఆగ్రాతో పాటు ఎర్నాకులం-హౌర్ స్టేషన్ల మధ్య నడిచే రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.