చంద్రబాబుకు సోము వీర్రాజు సవాల్  

  • Published By: chvmurthy ,Published On : December 31, 2018 / 03:57 PM IST
చంద్రబాబుకు సోము వీర్రాజు సవాల్  

Updated On : December 31, 2018 / 3:57 PM IST

విజయనగరం:ఏపీ ని బిజెపి అభివృద్ధి చేసిందో, టిడిపి అభివృద్ధి చేసిందో తేల్చేందుకు సిఎం చంద్రబాబునాయుడు చర్చకు రావాలని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమువీర్రాజు సవాల్ విసిరారు. వంద ధృత రాష్ట్రులతో సమానమైన చంద్రబాబునాయుడికి రాజకీయాల్లో కొనసాగే అర్హతే లేదన్నారు. రాజకీయాల్లో నిబద్ధతను చంద్రబాబునాయుడు తుంగలోకి తొక్కారని ఆయన విమర్శించారు. రాష్ర్టాన్ని బిజెపి యే అభివృద్ధి చేసిందని,యుసి కూడా ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్రప్రభుత్వం ఉందని సోమువీర్రాజు అన్నారు.